పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

67


తరుణారుణారుణ ఘుసృణ
కిరణాకృతి సాంధ్యకాలకీలిచ్చాయా
స్ఫురణాఢ్య బ్రహ్మశిఖరా
వరణాంతర సౌధమధ్య వరపీఠమునన్.123

మంజుహాటక కంజ కింజల్క వర్ణుండు
          పద్మరాగ కిరీట భాసితుండు
గండమండల రత్నకుండల లలితుండు
          కేయూర మణిహార కీలితుండు
కల్పద్రుమాలికాకలిత వక్షోభాగుఁ
          డుపవీత శోభితుఁ డున్నతాంసుఁ
డాజానుదీర్ఘ బాహా సముల్లాసుండు
          వాణీవిలావైక వదనకమలుఁ
డజుఁడు గొలువుండు వేదశాస్త్రాగమాది
విద్యలెల్లను దను జాల వినుతినేయ
గరుడ గంధర్వ యక్ష కిన్నరులు సురలు
సిద్ధసాధ్య సమూహముల్ చేరి కొలువ.124

అచ్చోట నొకపక్ష మతిభ క్తితో నిల్చి
       దొనలలో స్నానంబు దనరఁ జేసి
భూతిరుద్రాక్ష విభూషణుండయి దివ్య
       పంచాక్షరీ మంత్ర పఠన మొప్ప
హృదయంబులోన కోటీశు నీశ్వరు నిల్పి
       మానసపూజ నీమంబుతోడఁ
జేసి బాహ్యర్చన సిత పుష్ప నవ బిల్వ
        దళములఁ గావించి లలిత నిష్ఠ