పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము



సకల లోకైకనాథుండు శార్గ్ఙ ధన్వి
గరుడ జయ విజయ సునంద పరమ భాగ
వత వతంసంబు లెంతయు బలసి చుట్టు
గొలువఁ గొలువుండు విష్ణుఁడ క్కూటమునను.119

అచ్చోట నతిభక్తి నైదుదినంబులు
           నిల్చి త ద్రోణికానీరములను
స్నానంబు నేసి భస్మ త్రిపుండ్రాంకముల్
         ధరియించి రుద్రాక్షధారి యగుచు
మునిసేవ్యు పాపనాశన లింగమూర్తిని
          బిల్వదళంబులఁ బ్రీతితోడ
నర్చించి దృఙ్మనః ప్రాణంబు లొకచోటఁ
          గలయ సమాధి సంకలితుఁడగుచు
తపముసల్పిన నష్టవిధంబులైన
సిద్ధులును గల్గు దగఁ గాయసిద్ధి దనరు
నితర సిద్ధులు సిద్ధించు నిచ్ఛలేక,
యుండెనేనియు మోక్షంబునొందు వేగ.120

అందు నేను మహేశ్వర్య కంచమగుచు
పాపనాశన లింగమై పరగుచుండ
నన్ను సేవింపుచుండు నా నలిననాభు
డధికభక్తిఁ ద్రికాల పూజాభిరతుల,121


బ్రహ్మశిఖరము


రుద్రశిఖరంబు వలపల భద్రదంబు
బ్రహ్మశిఖరంబు భాసిల్లుఁ బ్రస్ఫుటముగ
నెలమి నందుండు నూత్నకోటీశలింగ
మచటి మహిమంబు వర్ణింప నలవియగునె. 122