పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

61


యా మంత్రతోయంబు లాలింగ మూర్ధస్థ
           బిలమధ్య గతములై పృథివిలోని
కరిగి యచ్చటఁ బుట్టె వరనదీతిలకంబు
          సలలి తోంకారాఖ్య గలిగి యదియు
నా త్రికూటాద్రికి నపరభాగంబునఁ
          బ్రవహించె నిర్మలవారి యగుచు
          
నట్టి యోంకార నదియందు నహరహంబు
స్నానములు సేయు నా గుహాస్థల నివాస
సిద్ధ సంఘంబు నిజయోగ సిద్ధికొఱకు
తన్మహత్వంబు వర్ణింపఁ దరమె జగతి ? 98

ఇట్టి విధంబున జగతినిఁ
బుట్టెనె మున్నెన్నఁడైన బొసగఁగ నదు లే
పట్టున నిట్టి మహత్వము
గట్టిగ లేదనుచు విబుధగణము నుతించెన్.99

అట్టి యోంకారనదియందు నధిక భక్తి
మునిఁగి తజ్జలోదీర్ణమౌ పూర్ణకలశ
మెత్తికొనిపోయి గిరిని కోటీశలింగ
మూర్తి కభిషేక మొనరింప ముక్తిగలుగు.100

నగము త్రికూటంబట, నా
పగ దా నోంకారనామ భాసితయట, సొం
పగు వనులు బిల్వవనులట
యగు లింగము దక్షిణాస్యుఁడట చిత్రమగున్.101

గిరులును నదులును వనములు
నరుదుగ లింగములు గల మహాస్థలు రెన్నో