పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

44

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


జగమంతయును రజ్జుసర్ప ప్రతీతీగా
         నాభాసమాత్ర మౌనని తలంచి
తనకు నావరణమై తగు నవిద్యను విద్య
        చే రయంబున బాసి వేరులేక
బ్రహ్మంబు తానయై వాసనా త్యాగాఖ్య
       యోగంబుచేత విరాగియగుచు
చిన్మయానందంబు జెందుట సాయుజ్య
        ముక్తినాదగు నిదె మోక్షమనుచు
        
శ్రుతులఁ బలుకంగబడియె విశ్రుతముగాఁగ
ముక్త్యుపాయంబు జ్ఞానమౌ ముఖ్యముగను
జపతపోవ్రత సత్యశౌచములు క్రమము
దనర ముక్త్యుపాయంబులౌ తపసులార !27

ముక్తి తెలిసియుఁ దదుపాయ ములునుగలిగి
యుండియును మోచకుం డీశు డుండకున్న
ముక్తి కల్గదు, షడ్వర్గ ముక్తికాదు ;
వసుధ నవవర్గ మపగత వర్గమండ్రు.28

కొందఱు కామాదులు మదిఁ
జెందినఁ గొరతేమి తాను జిన్మయుఁడగుటన్,
జెందును తద్వికృతుల నది
యందురు విజ్ఞాన హీనులయి ధరలోనన్.29

మది కామ క్రోధాదులు.
గదియుటచే గాడె మున్ను కల్పావధిగా
వదలక జన్మ జరామృతు
లొదవె సంసారమమత యుడుగక నిలిచెన్ .30