పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

42

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


మీరలు సాధనచతుష్టయ సంపన్నులును కామక్రోధాది రహితులును దేహాభి మాన వర్ణితులను జితేంద్రియులు నగుట పూర్ణాధికారులగు మీకతి సుల భంబుగా స్వాత్మావ బోధంబగుగాని యనధికారులకు నెన్ని విధంబుల బోధించినం దెలియదవీచెప్పి దయాళుండై.18


ముందర పార్శ్వంబు లందును వెనుకను
         సందుల గొందులఁ గ్రిందుపడఁగ
క్రిందట మీఁదట ముందట ముంగిట
         లోపల వెలుపల లోకమెల్ల
ప్రళయ కాలాంభోధి భంగిని బూర్ణమై
        యచలమౌ బ్రహ్మంబు నా క్షణంబ
మౌనముద్రారూఢ మహిమచే సూచన
        గావించి చూచి యుత్కంఠమీఱ
        
[1]చాక్షుషీ దీక్ష యొసఁగి నిస్సంశయముగ
శక్తి పాతప్రకారైక సరణిఁ దెలువఁ,
బడి విగ్రహ మవనిపై వారి కంత
నంత కాంతకు సత్ప్రసాదాప్తివలన.19

అపుడు విస్మృతిజెంది బాహ్యంతరముల
మరచి సనకాదులంతట నెఱుకగలిగి
గురునిఁబూజించి బ్రహ్మైక్య గరిమగనిరి
మరలవారల కనియె నా పరమగురుఁడు.20

చాక్షుషీ దీక్షచేతను శక్తి పాత
మరయనేరక బయలు బ్రహ్మంబదించు

  1. చాక్షుషీ దీక్ష — చేప గ్రుడ్డులను చూచినంతనే పిల్లలగును. అట్లే దక్షిణామూర్తి
    మౌనమొద్రతో చూచినంతనే గురుబోధ జరిగినది అని భావము