పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము



నీవు నిర్దేహివయ్యును నీలకంఠ
సువిమలస్ఫుటమూర్తివై సులభముగను
పక్వచిత్తుల కుపదేశపథము దెలుప
దక్షిణామూర్తి రూపంబుదాల్తు వభవ.11

బ్రహ్మమానసమున ప్రభవించియును మేము
        సకల వేదార్థముల్ జదివి వినియు
బ్రహ్మ మిట్టి దటంచు భావించి తెలిసియు
        స్వానుభూతిక్రియాసరణిలేక
దేశికశ్రేణిచే దేవ : నీ యనుభూతి
        వెలయు శాస్త్రాళిచే, దెలియదనుచు
బుధవర్యులను జేరి బోధింపుఁడని పల్క
        మే లెఱింగిన యట్లు ప్రేమ వారు

పల్కి రటులౌట బల్కులు పల్కరాని
పరమనిర్గుణ తత్త్వంబు బట్టబయలు
గాగ తెలివిడి సేయుమీ కాలకంఠ!
గురువులకునెల్ల మొదలింటి గురువ వీవ.12

అని మునులు విన్నవించిన
ఘనయోగసమాధి వదలి కరుణాన్వితుఁడై
జననాంతదూరుఁ డీశుఁడు
మునివర్యులఁజూచి పలికె మోదంబెసఁగన్.13

గంధమాదన కైలాస కనకశైల
మందరంబుల గౌరి ప్రమధనిచయము
గొలువఁ గొలువుందు భక్తులకోర్కె లొసఁగ
విల మహాస్థలి లింగమై నిలిచినట్లు.14