పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

30

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము


శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట


ఆమాటల్‌విని శంభుడిట్లనియె నీవత్యంత రౌద్రక్రియో
ద్దామ ప్రౌఢిమ దక్షుఁజంపి మఖవిధ్వంసంబుగావించి సు
త్రామాజాచ్యుత ముఖ్యదేవతల గర్వంబెల్ల వారించి ను
క్షేమంబొప్పగ వేగరమ్మిటకు నక్షీణప్రభావోన్నతిన్. 122

అని యిట్లు శివుఁడు బలికిన
ఘనుఁడవ్వీరుండు భద్రకాళియుతుండై
చనువేళఁ దత్సహాయం
బనఘుల గణవరులఁబంచె నధికప్రీతిన్. 123

వారు ననేకోత్కట కరవాల భిండివాల తోమర ముసల ముద్గరాది నానాయుధ పాణులై వీరభద్రేశ్వరుంజుట్టుకొని దక్షాధ్వరశాల కభిముఖులై చనునపుడు కొందఱుగణంబు లద్దేవు నుద్దేశించి వందిమాగధగీతంబులు పాడుచు నిట్లని స్తుతియించిరి. 124


చటుల భుజాస్ఫోట జనితోద్భటార్భటి
             బ్రహ్మాండ భాండంబు పగిలిపడఁగ
గమనవేగాకీర్ణ ఘనజటానిహతిచే
             గ్రహవీథినుండు తారకలువ్రాల
నిటల నేత్రానల స్ఫుట విస్ఫులింగంబు
             లంబరంబునఁ దారకాళి గాఁగ
తతపదఘట్టనోద్ధత భూపరాగంబు
            నిర్జర వాహినీ నీరమడఁప

నీవు దక్షుని మర్దింపఁబోవుసరణి
నిఖిల లోకాద్భుతస్ఫూర్తి నివ్వటిల్లు