పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము

3


అని యిష్టదేవతా వందనంబును సుకవిజనాభినందనంబును కుకవి నింద
నంబునుం గావించి శైవకథావిధాన బోధకంబగు నొక్క ప్రబంధంబు
రచియింపంబూని యేకాంత ధ్యానావధానంబున నున్న సమయంబున 11

అరుణారుణాంశు భాస్వర జటావళివాఁడు
         స్ఫురదిందు ఖండ శేఖరమువాఁడు
భసిత త్రిపుండ్రాంక ఫాలభాగమువాఁడు
         కరుణా కటాక్ష వీక్షణమువాఁడు
నీల నీరదకాంతి కాలకంఠమువాఁడు
         కటితటి శార్దూల పటమువాఁడు
వరదాభయమృగాగ్ని కరచతుష్కమువాఁడు
         దక్షిణామూర్తియై తనరువాఁడు

శాశ్వతామృతదాయి కోటీశ్వరుండు
నాదు సన్నిధిఁ బొడసూపి నాకు నొక్క
స్థల పురాణంబు రచియింపఁ జాలు దీవు
నేయుమని యదృశ్యస్థితిఁ జెందుటయును. 12

అంతట నేను రచియింపంబూనిన యతిచమత్కృతిమత్కృతి యగు నీ కృతి
రత్నముఖంబునకుఁ దిలకాయమానంబగు మద్వంశావతారం బభివర్ణించెద.