17
మొదలగు పద్యములు చూడవచ్చును. అఖిల చ్ఛందోమయుఁడగు పరమేశ్వరుని దేవేంద్రునిచే వివిధ చ్ఛందోమయ స్తోత్రమున స్తుతింపఁజేసిన కవి యుచితజ్ఞత మెచ్చఁదగినది.
“తరుణి మాకు విరోధి నీ ధవుఁ డతండు
ప్రేత భూత పిశాచ సత్ప్రియ సఖండు
యజ్ఞభూమికి నరుదేఱ నర్హుఁడగునె ?
అతని సతివౌట నీవు ననర్హ విపుడు."
ఇందు 'ఇపుడు' అను పదము మిక్కిలి భావగర్భితము. ఇట్లు పదములను సముచితముగ వాడిన పట్టులు పెక్కు గలవు.
ఈ పద్యమందలి ధారాశుద్ధి, జూడుఁడు :
కాము మెక్కు వౌను కడియ నోటికిఁ బోదు
ధనమున౦దుఁ బ్రేమదగులు మిగుల
చిక్కువడుచునుండుఁ జింతల వంతల
ముదిమి మోక్ష సౌఖ్యమునకు తెరువె ?
భక్తిరస భరితములై న యిట్టి సత్కావ్యములలో నెరసులు పరికించుట సరసుల పని కాదుగదా ! ఇహపర సాధనమైన యిట్టి మంచి కావ్యమును వెలుఁగులోనికిఁ దెచ్చుటకై మిక్కిలి శ్రమపడి సఫలుఁడైన మా సోదరుఁడు విద్వా౯ భాగవతుల వేంకట సుబ్బారావును, ఆతనికి, దోడ్పడిన నరసరావుపేట నగరపాలికాధ్యక్షులు శ్రీ కొత్తూరి వేంకటేశ్వర్లగారు మొదలగువారలకును మా హృదయ పూర్వకాభివందనములు.
3 - 4 - 862 బర్కత్ పూరా,
హైదరాబాదు.
31 - 8 - 1959.
శ్రీనివాస సోదరులు
శతావధానులు.