పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

147


సచ్చరితు లైనవారికి
నిచ్చట వసియింపగల్గు నెప్పుడు ననుచున్. 289

అని మనంబునం దలంతు రెంతయు. 290


పరమానురాగ వశమున
ధరణీసురు లచట బ్రహ్మతత్త్వ విచారం
బురుభక్తిఁ జేయుచుందురు
పరమానందంబుతోడఁ బ్రజ్ఞాన్వితులై. 291

సామగానంబులు సదివెడువారును
           వేదాంశాస్త్రముల్‌ వినెడువారు
శివపూజ లర్థితోఁ జేసెడువారును
           పరగ భాగ్యంబులు వల్కువారు
పంచ స్తవంబులు పఠియించువారును
           స్మరణంబు భక్తిచే సల్పువారు
శివపురాణంబులు నెప్పెడివారును
          శివపద ధ్యానంబు సేయువారు

దృఙ్మనః ప్రాణముల నొక్కదిక్కుఁ జేర్చి
నిర్వికల్ప సమాధిలో నిల్చువార
లగుచు విప్రులు శివరాత్రియందు జాగ
రంబు సేతురు మహితోత్సవంబు దనర. 292

పుష్కర తాడన ధ్వనులు బోరుకొనం దగఁ దన్నగాగ్రయు
క్పుష్కర మధ్య సంభవ సుకోమలశోభిత వాసనా మిళ
త్పుష్కరజాలముల్‌ గొనుచు ము క్తిపదంబును గూడువట్టి యా
పుష్కరకేశు మూర్దమునఁ బూజ నొనర్తురు భక్తియుక్తిచేన్. 293