పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


నెక్కి దేవర్షితతు లిరుప్రక్కలందు
స్తవము సేయంగ వత్తు రుత్సవముఁ గనఁగ. 250

దివ్య విమాన యానులయి దేవగణంబులు మింటనుండి రా
భవ్య తరాప్సరోంగనలు పాటలు బాడుచు ముందు ముందుగా
నవ్యమరాళయానలయి నాట్యము సేయుచు వచ్చుచుండ స
ద్ద్రవ్యసమృద్ధి నగ్గిరివరంబు జెలంగె మహాద్భుతంబుగన్. 251


ఇట్లు సర్వసుపర్వనికాయం బరుదెంచి యమ్మహామహీధరాధిత్య కాంత కాంత బిల్వకాంతార మధ్యంబునం బ్రవేశించి మహాశివరాత్రిం దత్తద్ద్రోణి కాజలంబుల స్నానంబు సేసి భస్మోద్ధూళిత త్రిపుండ్రాంకిత గాత్రులును భద్ర రుద్రాక్షమాలికా భరణులును, పంచాక్షరీ జపపరాయణులునై త్రికోటీశ్వర లింగంబునకు మహాన్యాసపూర్వకంబుగా నభి షేకంబుచేసి షోడశోపచారంబులం బూజింపుచుందు రిది దివ్యోత్సవంబు మనుష్యుల కగోచరం బింక మనుష్యోత్సవం బెట్టిదనిన. 252

మాఖ శుక్ల ప్రతిపదాది మాఖబహుళ
వరచతుర్దశి పర్యంత మురుగజాశ్వ
మహిష కాసర గోవృషోన్మద వరాహ
కుక్కుట శునక మార్జాల కోటిఁ దెచ్చి. 253

మొక్కుబడి దీర ద్రిప్పుదు రక్కుధరము
నకుఁ బ్రదక్షిణంబుగను జనంబు భక్తి
నభవ కోటీశ కోటీశ హరహరా మ
హేశ యను నినాదము నభం బెల్లనిండ. 254

ప్రతి దినంబును శుద్ద పాడ్యమి మొదలుగా
              మాఘ మాసంబున మనుజు లా త్రి