పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

111

ఆ లలన భక్తి యుక్తికిఁ
జాలంగా సంతసించి జంగమరూప
శ్రీలలితుఁడు కోటీకుఁడు
బాలామణి కెదుట నిలచె బ్రస్ఫుటలీలన్.117

ఆమూర్తిఁగాంచి డగ్గరి
భామిని సాలంక భక్తవరునకు వని ము
న్నీమూర్తిగా దె కన్పడె
నా మూ ర్తినిఁ గొలుతునే ననంతము ననుచున్.118

ఆమహాత్ముఁడు క్షీరోపహార మొకటి
దక్క నన్యంబు గొనఁడని తానెఱింగి
యుంట, గోక్షీరములు దెచ్చి యువిద భక్తి
నర్పణము సేయు నిత్యకృత్యంబుగాఁగ.119

మున్ను సాలంక సద్భక్త పుంగవుండు
క్షీర మాతని కొసఁగి తచ్ఛేష మాత్మఁ
దృప్తిగాఁజేసి శేషమప్రా ప్తమైన
వాసరంబుల నుపవాసవ్రతము జేసె .120

నేనును గోక్షీరము లీ
మౌనీంద్రున కొసఁగి శేషమాహారముగా
బూనెద తచ్ఛేషంబును
లేనియెడం దనువు విడుతు లీల దలిర్పన్ .. 121

అని యి భీరాంగన
ఘనమగు తద్వ్ర తము బూనఁ గదలక యతఁడున్
దన యిచ్చజనక నిచ్చెను.
వనజాక్షికిఁ బ్రాణహాని వచ్చునటంచున్ .122