పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105


నంద నందనుఁడయ్యే నా నాథుఁ డల సు
నంద నందన నాదు నే ననుచు లక్ష్మీ
యా సునందున కాత్మజయై జనించె
ననఁగ నానందవల్లి తా నతిశయిల్లే.87

హరుఁడు కోటీశుఁడై త్రికుటాద్రియందు
నిలువఁ దద్భక్తి తత్రాంత కలిత నగరి
గరిమ నానందవల్లినా నెఱి జనించే
నట్లు గాకున్న బుధజనాహ్లాదమగునె.88

మఱియు నబ్బాల శిశుత్వంబునందు నిచటి కోటీశనిలయ త్రికూట కూటం బులం జూచు వైఖరి మెల్లనం గనువిచ్చి చూడఁ దొడంగె. శివభక్తి రహితులై చెడు జనంబుల శిక్షించిన నవ్వు చందంబున నవ్వసాగె. శివనామంబు వలుకు లీల మెల్లనం బలుకఁ బూనె. కోటీశ్వరదర్శనంబున - కరుగు రీతిఁ దడబడుచు నడుగిడఁగఁ దొడఁగెఁ నంత కౌమారసమయం బగుటయు నాభీరమతల్లి యానందవల్లి తల్లిదండ్రులు వేయు హారవల్లరులును ఫుల్లకల్హార మల్లికా మాలికలనుం దిగనాడి భద్రరుద్రాక్షమాలికలు గ్రీవాలం కారంబుగా ధరింపును మేనంబూయు కర్పూర కస్తూరికాపటీర గంధ చర్చా చర్చ నుత్సాదనంబు చేసి భసితాంగరాగం బంగంబునం దనురాగంబునం బూయుచు బోటు లాటలంబాడు జిలిబిలి పాటల నటులోటఁబుచ్చి మాటి మాటికిఁ గోటీశమీఁది గాథల మాటలు నోటికి సూటిపఱచుచు నింద్రి యంబులఁ దత్తద్విషయంబు లనుభవించునెడఁ గోటీశ్వరార్పణంబు సేసి గ్రసింపుచు నిట్లఖండ భక్తి భావనావశంబుననుండు నవసరంబున వధూమ తల్లియగు నానందవల్లికిఁ దల్లి యిట్లనియె.89

అమ్మ మనయింట సకల భాగ్యంబులుంట
నవియు భోగింప కీ లీల నవయదగునె
నవలతాతన్వి యీ తపోనటనలెల్ల
ఆపసులకుగానిఁ చిన్నారి తరుణి కగునె ?90