పుట:శృంగారనైషధము (1951).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

57


ద్వీమత్తుం డయి చొక్కుఁ జిత్తమునఁ బృథ్వీనాయకుం డెంతయున్.

105


హంస నలుని వీడ్కొని సత్యలోకంబున కేగుట

వ.

ఇవ్విధంబున నానందరసమగ్నుండై యన్నరేంద్రుం గనుంగొని విహంగపుంగవుండు కార్యంబు సంఘటితం బయ్యె, నింక నాకుం బంకజాసనునకుం బరిచర్య చేయం బోవలయు
నని పలికి యతనిచేత సముచితప్రకారంబు వీడుకోలు వడసి యమ్మానసౌకంబు బ్రహలోకంబునకుం జనియె. నప్పుడు.

106


తే.

నిషధభూవల్లభుం డాత్మ నిండియున్న
కౌతుకంబు ప్రకాశంబు గాకయుండ
వనము వెలువడి పరివారజనులు గొలువ
వచ్చెఁ గ్రమ్మఱ నాత్మనివాసమునకు.

107


వ.

వచ్చి విదర్భరాజకన్యావియోగవిహ్వలుం డగుచుఁ గాలంబు గడపుచుండె. నంత నక్కడ.

108


దమయంతీవిరహవర్ణనము

చ.

నలవసుధాకళత్రునిగుణంబె గుణంబుగ సారసౌరభా
కలికతదీయకీర్తికలికామయ మైనశరాసనంబునన్
విలసితసౌమనస్యపదవీరుచిరం బగుతద్విలాసమున్
ములికగఁ జేసి మన్మథుఁడు ముద్దియ నేయఁదొడంగె నెవ్వడిన్.

109


తే.

అతనుతాపజ్వరంబు మై నమరియుండఁ
జపలలోచన ప్రియకథాసరసిఁ దేలె
నాయపథ్యంబునన కదా యంతకంత
కలరుఁబోణికి సంతాప మతిశయిల్లె.

110