పుట:శృంగారనైషధము (1951).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

45


తే.

అతనిబాహాపరాక్రమం బభినుతింప
నలవియే పద్మజునకైన నబ్జవదన?
శాతతద్బాణధారాభుజంగభుక్తి
వైరిరాజప్రజీయాసుమారుతంబు.

53


చ.

వినుకలిఁ గూర్మిఁ జిక్కి పృథివీభువనంబునకుం డిగంగ నే
యనువును లేక రంభ యనునచ్చరలేమ నలున్ వరింపఁ బూ
నినతనకోర్కి నొక్కమెయి నిండఁగఁ జేయుటకై భజించెఁ దాఁ
గొనకొని వేల్పులందు సలకూబరుఁ దచ్ఛుభనానువాసనన్.

54


వ.

ఆరాజుకడం జనవు గలిగి వర్తింతు మఱియును.

55


మ.

స్మరవాత్స్యాయనకూచిమారకృతశాస్త్రగ్రంథసందర్భముల్
పరిశీలించినవాఁడ దంపతుల కుత్పాదింతు సారస్యముల్
మురిపెం బొప్పఁగ మందమందగమనంబుల్ నేర్పుదు న్మేదినీ
శ్వరశుద్ధాంతనితంబినీజనులకున్ సంపూర్ణచంద్రాననా!

56


వ.

భామినీజనంబులకు భావభవనవ్యాజ్ఞావిశ్వాసముద్రానిక్షేపభూమినై యుండుదు నన్నుఁ దివ్యజ్ఞాతిమాత్రంబుగాఁ దలంపవలదు, విరించివదనకమలవినిర్గతవివిధాస్త్రవాసనాపూర్ణకర్ణుండ నైనయేను సామాన్యుండనే! నన్నుం బనిగొమ్ము, ఈశరీరంబు పరోపకారార్థము గదా! పద్మాసనుని శిల్పప్రయాసంబు లక్ష్మీనారాయణులయెడలను గౌరీవృషభాంకులపట్టుననుంబోలె మీయెడల బరస్పరయోగ్యసమాగమంబునకు బాల్పడుంగాక! వేలాతిక్రాంతకాంతగుణాబ్ధివేణి వగునీవు నలునిపాణిపల్లవంబు పరిగ్రహింప నర్హురాలవు, కోమలంబగు మల్లికాముకుళదామంబు గర్కశం బగుకుశ