పుట:శృంగారనైషధము (1951).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4


వర్తనమొనర్చుటయేగాక తఱచుగా నందలిద్విపదలనే తనపద్యముల నెక్కించె నని పిడుపర్తిసోమన వచించియున్నవాఁడు.

కాశీఖండమున వేమభూపాలుఁడు త న్నుద్దేశించి చెప్పినట్టు లీతఁడురచించిన “ఈక్షోణిన్ నినుఁ బోలుసత్కవులు లేరీనాఁటికాలంబునన్.” అనుపద్యార్థమెంతేని నిజము. అట్టికవి యానాఁడు లేఁడు. శ్రీనాథుఁడు కొండవీటిరాజులలోఁ బెదకోమటియాస్థానకవి. అంతేగాదు. తత్ సంస్థానవిద్యాశాఖాధికారిగసహిత ముండెను. వేమారెడ్డియాస్థానమున దిగ్దంతివంటి సంస్కృతకవి వామనభట్టబాణుఁడను వాఁడొకఁడుండెను. ఇతఁడు విద్యారణ్యులవారిశిష్యుడు. వామనభట్టబాణుఁడు సంస్కృతమున వ్రాసిన గ్రంథములలో నలాభ్యుదయ మొకటి. అది నలునిచరిత్రలోఁ బూర్వభాగము. ఈరచనయే శ్రీనాథుని హర్షనైషథాంధ్రీకరణమునకుఁ బ్రేరకమయియుండును. మైత్రికి భంగమురానివిద్యాస్పర్ధచే శ్రీనాథుఁడాకృతిఁ దలపెట్టియుండును. ఇది క్రీ. శ 1415 ప్రాంతమున రచియింపఁబడియుండునని యూహ.

"చిన్నారిపొన్నారి చిఱుతకూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర” ఇత్యాదిపద్యములవల్ల శ్రీనాథుఁడు బహుగ్రంథకర్తయని స్పష్టమగుచున్నది; కాని వాన నుపలభ్యమానములు నైషధము (1415), హరవిలాసము (1425), భీమఖండము (1430), కాశీఖండము (1445), శివరాత్రిమాహాత్మ్యము, క్రీడాభిరామము (వీథినాటకము), పల్నాటివీరచరిత్రము ననుగ్రంథములే.