పుట:శృంగారనైషధము (1951).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 17


వ.

ఇవ్విధంబున ననన్యరూపలావణ్యరేఖావిలాసభాసమానయగు భీమనందన యానరేంద్ర బృందారకునియందు డెందంబు నిలుపుటయును.

71


తే.

అప్పు డనలావరుద్ధత నారఁ గూరి
బాణపురమును బోనియాభైమిమనముఁ
బుష్పబాణాసనుఁడు భోగభోజి యైన
వరవయోవిశేషంబు వార్వముగఁ దఱిసె.

72


దమయంతి నలునియం దనురక్త యగుట

వ.

దమయంతియు శ్రవణప్రీతివాసనావశంబునం బ్రతిదినప్రవర్ధమానంబగు మనోనురాగంబు నిరూఢంబై యుండ.

73


మ.

జనకుం గొల్వఁగ వచ్చినప్పుడు తదాస్థానంబులోఁ బాఠకుల్
వినుతప్రౌఢి వసుంధరాధిపతులన్ వేర్వేఱ కీర్తించుచో
వనితారత్నము వీరసేనుతనయున్ వర్ణింపఁగా నున్నత
స్తనభారంబు కెలంకుల న్నినుచుఁ జంచల్లీలరోమాంచముల్.

74


తే.

మహిమ హిమవేళలందు నమ్మానవతికి
మాసరము లయ్యెఁ దలఁపంగ వాసరములు
పొడవు గలిగి తపర్తుసంపూర్తియందు
సంచితాయమవతు లయ్యె యామవతులు.

75


సీ.

సఖులుఁ దాఁ బుష్పాస్త్రుసామ్రాజ్యపదవికి
        నభిషేక మొనరించు నవనినాథు
నలనామధేయ మైనతృణంబు వినఁబడ్డ
        నధిపతిపే ర్విన్న యట్ల యలరు