పుట:శృంగారనైషధము (1951).pdf/298

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

281


తే.

తన కనిష్టంబు లగుకలిద్వాపరముల
కేతు సూపియుఁ బోలే ధాత్రీశ్వరుండు
నిత్యసత్త్రేత ఋత్విక్ప్రణీత యైన
త్రేత సేవించె విజితమిత్రేతరుండు.

37


తే.

విభుఁడు ప్రాహ్ణేతనక్రియావిధికలాప
మీవిధంబునఁ దీర్చి సద్భావ మొప్ప
భామినీభావజిజ్ఞాసఁ బాదపద్మ
యుగము నిశ్శబ్దముగ మెట్టు చొయ్య వచ్చె.

38


ఉ.

మిన్నక చేర వచ్చి యొకమేలపుమైవడిఁ బువ్వుఁబోఁడి క్రా
ల్గన్నులు మూసెఁ బాణికమలంబుల భూపతి నవ్వుచున్నయా
సన్నసఖీజనంబుఁ గనుసన్న నదల్చుచు నవ్వధూటి క్రా
ల్గన్నులఁ జేరలం గొలుచుకైవడిఁ గన్నుల నవ్వు దేఱఁగాన్.

39


తే.

ఒక్క పూఁబోఁడి భూసంజ్ఞ నొయ్యఁ బిలిచి
యాత్మహస్తాధికార మయ్యబ్జవదన
హస్తముల కిచ్చి యెఱుఁగనియట్ల తాను
వసుమతీశుండు నగె నప్డె వచ్చినట్లు.

40


తే.

జ్ఞాతహస్తాంబుజాంతరస్పర్శ యగుటఁ
గైతవంబు నెపంబు గాఁ గమలనయన
మానసంబున మానసంపద వహించె
నాననంబున ధరియించె మౌనముద్ర.

41


చ.

కుటిలకటాక్షవీక్షణముఁ గోమలనూత్నకపోలరాగముం
జటులసమంచితభ్రుకుటిసంవళనంబునుఁ జూచువేడుకన్
జిటపొట రేఁచె రాజు సరసీరుహనేత్రకుఁ గామకేళికిన్
గటుకులు గానిమానములు గావె ప్రదీపనసిద్ధిహేతువుల్.

42