పుట:శృంగారనైషధము (1951).pdf/280

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

263


దల్పయంత్రణనిరోధంబునంకిలి కోర్చి
        యర్ధాంకపాళిక నాదరించుఁ
నిబిడనీవీబంధనిర్మోక్షణమునకుఁ
        బని పూని భీతిఁ గంపంబునొందు


తే.

నూరుసంవాహనమునకు నుత్సహించు
ఘనసనితంబంబుపై నుండ మనసు వెట్టు
నిమ్ననాభికి డిగ్గంగ నెమ్మిసేయుఁ
బద్మలోచన మరఁగి భూపాలుకరము.

172


తే.

విభుఁడు పరిహాస మాడి నవ్వించుఁగాని
పడయలేఁడయ్యె నెన్ని యుపాయములను
రాజబింబాస్యతాంబూలరాగసుభగ
దంతకురువిందమాలికాదర్శనంబు.

173


మ.

మనుజాధీశుఁడు మగ్నహారలతికామాణిక్యముద్రాంకిత
స్తనభారంబుగ గాఢనిర్దయపరిష్వంగంబు పూఁబోడికిన్
ననుపుంగూరిమిమై వడి న్మరపెఁ దన్మందాక్షభావంబునన్
దనపూవిల్లును నొక్కచందమునఁ గందర్పుం డొగిన్ వంపఁగాన్.

174


తే.

మెలతఁ యప్పుడు మందాక్షమీలితములు
సౌహృదస్మేరములు నైనసంగమముల
ముకుళితంబులుఁ బుష్పితంబులును నైన
భూజములతోడియుద్యానభూమిఁబోలె.

175


సీ.

'అధరంబు చవిసూపు మన్య మేమియు నొల్ల'
        నని చెక్కుఁ జేరి మంతనము వలుకు