పుట:శృంగారనైషధము (1951).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

225


మ్మెదపదుపుల్మదోదయము మిక్కిలివేడుకయున్ మనంబులం
బొదలఁగ క్రొత్తయామనికిఁబొచ్చెములే కెదురేఁగుచాడ్పునన్.

17


వ.

ఇట్లు మంత్రిపురోహితామాత్యదండనాథప్రధానంబుగాఁ బౌరజనసమూహంబు దన్నెదుర్కొన సముచితప్రకారంబున.

18


నలదమయంతుల పురప్రవేశము

శా.

ఏమో క్రొత్తయపూర్వవార్త విను చేమో చెప్పుచున్ దండనా
థామాత్యాదులు పాదచారమున సేవాసక్తి మైఁ గొల్చిరా
భూమీశాగ్రణి సొచ్చెఁ బట్టణము సంపూర్ణానురాగంబుతో
భామానేత్రచకోరచుంబితముఖప్రాలేయరుగ్బింబుఁడై.

19


క.

సకలధరాధీశ్వరుపైఁ
బ్రకటముగాఁ జల్లి రఫుడు పౌరపురంధ్రుల్
సుకుమారబాహువల్లీ
ముకుళకులసకుల్యలాజముక్తాఫలముల్.

20


మ.

దమయంతీవదనావలోకనసముత్కంఠావలద్భామినీ
సముదాయాననచంద్రబింబపరిషత్సాన్నిధ్యయోగంబునన్
సముపేతార్థము లయ్యె సౌధమణిభాస్వచ్చంద్రశాలావితా
నము లుర్వీపతినందనుండు పురఘంటావీథి నేతెంచుచోన్.

21


తే.

ధరణీనాథాననేందుసుధారసంబు
సౌధజాలమృణాళికాజాలకముల
నుత్పలాక్షీకటాక్షనీలోత్పలములు
ప్రేమమునఁ దప్పిపోవంగఁ బీల్చికొనియె.

22


వ.

అప్పుడు.

23