పుట:శృంగారనైషధము (1951).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

195


దంచితుఁ డోషధీపతికులాగ్రణి వందిజనంబులో విశే
షించి విదర్భజాస్తవనశీలుర మిక్కిలి గారవించుచున్.

31


వ.

అప్పుడు గొంద ఱసూయాపరాయణులైనరాజు లారాచకుమారుం జూచి చూపోపక 'యత్యుచ్ఛ్రయః పతన హేతు' వనెడువారు 'నతి సర్వత్ర గర్జిత' మనెడువారును 'కాముకస్య కుతో లజ్జా' యనువారును 'సంగమో విప్రయోగాంత' యనువారును నై యుండి రప్పుడు.

32


ఉ.

నైషధుఁ డంతరంగమున నవ్వుచునుండు విరోధు లాడుదు
ర్భాషణముల్ విని విననిభంగి న దట్టిద విద్విషన్మృషా
దోషగుణాధిరోపణ మదోషతఁ దెల్పుచు సుండుఁ గానఁ ద
ద్దూషణ మెఫ్టు విన్నఁ బరితోషముఁ బొందు మనీషి యాత్మలోన్.

33


క.

క్రించు లగురాజతనయులు
వంచింపక యాడు దురపవాదోక్తులలోఁ
గొంచు నృపాలునిమ్రోలను
బంచమహాశబ్దములును బహుళము లయ్యెన్.

34


వ.

ఇవ్విధంబున నిషధరాజు శిబిరంబు ప్రవేశించె నట విదర్భమహీవల్లభుండును.

35


సీ.

కార్తాంతికులఁ బిల్చి కర్పూరసమ్మిశ్ర
        తాంబూలదానపూర్వంబు గాఁగ
జాంబూనదాంబరస్రక్చందనంబులఁ
        బూజించి భూపాలపుంగవుండు
'సర్వలక్షణకళాసంపూర్ణమై యుద
        యాస్తనిర్దోషమై యతిశయిల్లు