పుట:శృంగారనైషధము (1951).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

137


ప్రసాదంబున సకలభూతాంతర్వర్తనంబులు దెలివి పడియుండు, నిప్పుడు చింతాభరంబులం గలంగిన మీయంతరంగంబులవిషాదం బపనయింప వచ్చితిఁ బోయివచ్చెద నని సముచితప్రకారంబున నయ్యిరువురిచేత సుజ్ఞాతుండై పతంగపుంగవుం డరిగెఁ దదనంతరంబ.

110


క.

కనకమరాళం బీక్రియ
ననుకంపను బుద్ధి సెప్పి యరిగినవెనుకన్
మనమునఁ జింతాభరములు
జనపతికి విలాసవతికిఁ జయ్యనఁ బాసెన్.

111


నలుని మనశ్శుద్ధి

వ.

అప్పుడు నృపాలుండు హేమమరాళసాంత్వనాలాపబలంబున నెట్టకేలకు మనంబునం జేవ దెచ్చుకొని దిక్పాలురం దలంచి నమస్కరించి యిట్లనియె.

112


ఉ.

భావములో నదంభ యగుభక్తికి సంతస మందుఁ డొండెనొం
డే విధియింపుఁ డిప్పుడ కడిందిగ దండము దప్పుగల్గె నే
నీవిరహానలంబునకు నిం కిట నేమియు నోర్వ లేఁ జుడీ
దేవతలార! మన్మథునితీవ్రశరంబులు గాఁడి పాఱఁగన్.

113


వ.

అనంతరంబ తిరస్కరిణీతిరోహితయై యుండి యక్కుండినేంద్రనందన రాజనందనున కిట్లనియె.

114


ఉ.

ఓరజనీకరాన్వయపయోధినిశాకర! యేఁ బతివ్రతన్
గూరిమీ మీఱ నొక్కరునిఁ గోరి వరింపఁగ నున్న వారి కె
వ్వారికి సిగ్గుగాఁ దలఁప వచ్చునె? నిన్ను వరింతు నెల్లి బృం
దారకులు న్నృపాలురును దక్కినవారును జూచుచుండఁగన్.

112