పుట:శృంగారనైషధము (1951).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

89


గూర్చుండె, నప్పు డబ్బాలికారత్నంబు జననీప్రయత్నంబునం దత్సమీపంబున కరుగుటయును స్వయంవరకల్యాణమహోత్సవంబు సంపాదింపంబడుటయు శోభనారంభసంభ్రమంబులవలన నెఱింగినవాఁడు గావున నయ్యంభోరుహాక్షి సమాగమనం బపేక్షించుచుండె నప్పుడు.

106


తే.

అనుఁగుఁదల్లికి వందనం బాచరించి
వరుస నిలువేల్పులకు మ్రొక్కి వలను మిగుల
బ్రాహ్మణులచేత దీవెనల్ వడసి పుణ్య
భామ లిచ్చు హేమాక్షతప్రతతిఁ దాల్చి.

107


ఉ.

తల్లి మనఃప్రసాదసహితంబుగ నిచ్చినపుష్పదామమున్
బల్లవబాటలం బయిన పాణిసరోజమునన్ ధరించి యా
యల్లకతీవ్రసంజ్వరభరాలసకోమలగాత్రవల్లియై
యల్లన నేఁగుదెంచుకమలాననఁ జూచె విభుండు దవ్వులన్.

108


వ.

ఇట్లు వీక్షించి నిషధాధ్యక్షుండు సాక్షాత్కరించిన మదనసామ్రాజ్యలక్ష్మియుం బోని యాధవళాక్షిసమక్షంబు చేరంజనియె నప్పుడు.

109


ఉ.

ఎంతయు డాయ నేఁగియు మహీశుఁ డెఱుంగఁగ నేరఁడయ్యె వి
భ్రాంతివిదర్భరాడ్దుహితృపంక్తులలోన మృగాక్షి నప్పు డ
య్యింతి యెఱుంగదయ్యె దిగధీశచతుష్టయదత్తశాంబరీ
ధ్వాంతనిగూడుఁ డైనవసుధాధవునిన్ నికటస్థలంబునన్.

110


తే.

అతివ విభ్రాంతివీక్షితుం డైననృపతి
కంఠమున వైచెఁ జేతిచెంగలువదండ