Jump to content

పుట:శృంగారనైషధము (1951).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

83


తే.

అమ్మహారథురథము డాయంగ నరిగె
సత్వరమున విదర్భరాజన్యువీడు
సారమగు భాగ్యవంతుమనోరథంబు
కార్యసంసిద్ధివోలె నస్ఖలితలీల.

79


మ.

దమయంతీసుకుమారపాదకమలద్వంద్వార్పణాధన్యకు
ట్టిమహర్మ్యం బగుపట్టణం బపుడు గంటిన్ మంటి నం చెంతయుం
బ్రమదం బందె దిగీశకార్యఘటనాభారంబు చింతించి దీ
ర్ఘము నుష్ణంబునుగా నొనర్చె ధరణీకాంతుండు నిశ్వాసమున్.

80


వ.

ఇట్లు కుండీననగరంబు చేరం జనుదెంచి యప్పురుషప్రకాండుండు వలయునమాత్యులం దగినవారల నొక్కరమ్యప్రదేశంబున సైన్యంబు విడియ నియమించి బృందారకసందేశకార్యంబు నిర్వర్తింపం దలంచి ససారథికంబగురథంబు నచ్చోట నిలిపి యొక్కరుండునుఁ బాదచారంబున నప్పురంబు ప్రవేశించె నప్పుడు.

81


శా.

చూడంజూడఁగ దేవతావరమునం జోద్యంబుగా భూమిభృ
చ్చూడారత్న మదృశ్యుఁ డయ్యె నతఁ డచ్చో నద్భుతం బంద న
వ్వాడం బౌరజనంబు లెల్ల నితఁ డెవ్వాఁడొక్కొ? నేత్రోత్సవం
బై డాయం జనుదెంచె నంతటను మాయంబయ్యె నం చెంతయున్.

82


వ.

ఇ ట్లంతర్హితుండై రాజమార్గంబున నిరర్గళవేగంబునం జని యా రాజకుంజరుండు మదకుంజరఘటాసుందరం బగు రాజమందిరంబు డాసి.

83


సీ.

వంచనమై డాగి వర్తించు టిది యేమి
        ప్రాభవం బని సిగ్గుపాటు నొందు