Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యించి మూల్యంబున కంటె ద్విగుణాధికం బైన యుత్తమ
లాభంబు నొంది తత్రత్యసారవత్పణ్యద్రవ్యంబు నోడలయందు
వహించిన సముద్రద్వీపవాసిసాంయాత్రికుల విలోకించె. మఱియును

303


గీ.

జలధిలో నుండి పైకి రాఁదలఁచి ఫణులు
గరుడకేతుధ్వజంబులకరణి భూరి
నిశ్వసితవాతములచేత నీరరాశి
సలిలముల మీఁది కెగయంగఁ జల్లె నపుడు.

304


సీ.

ఉత్సంగశయ్యాశయుండు యుగాంతబం
                        ధుఁడు సమాగతుఁడైన తోయజాక్షు
వీక్షించి గురుతరప్రీతిప్రసారితా
                        యతభంగహస్తుఁడై యంబురాశి
తగ నెదుర్కొనిన చందంబునఁ గన నయ్యె
                        నత్తఱి నుత్సంగితాంబుకణుఁడు
బంధురైలావనాస్ఫాలనసంలబ్ధ
                        గంధుండునై గంధిగంధవహుఁడు


గీ.

వారినిధి వేల యందు దుర్వారభంగి
సకలసైన్యసమేతుఁడై సంభ్రమమునఁ
బోవు మురవైరి నెమ్మేనఁ బొడమినట్టి
చెమట లాఱ్చెను సైన్యంబు ప్రమద మొంద.

305


మ.

అతులప్రౌఢమురారి సైనికులు సొంపారన్ మహోత్తాలవా
సితతాళీవనసంప్రవృత్తవిచలచ్ఛీతానిలప్రేరణా
ద్భుతసీమంతితకేతకీకకనదంభోరాశిమధ్యావనీ
స్థలులం గాంచి చరించి రచ్చట వినోదక్రీడలన్ బల్విడిన్.

306


వ.

మఱియు, నాచమూచరులు లవంగకుసుమమాల్యకృతభూషణు
లును నారికేళఫలాంతర్జాలపాయులును నాస్వాదికార్ద్రక్రము
కులునై సముద్రునివలన నభ్యాగతప్రతిపత్తి నొంది రదియునుం
గాక.

307


సీ.

అగణితబహువర్ణహయశతాకులమును
                        బ్రతిమార్గమందును బ్రమథితోరు
భూభృత్సహస్రంబు పొసఁగ సంతతరమా
                        సహితంబు నగు హరిసైన్యమునకు
రంగుగా నేకతురంగజన్మంబును
                        బరఁగ నేకోర్విభృత్ప్రమథితంబు
తలపోయఁ జిరవిగతశ్రీకుఁడై యొప్పు
                        ద్వీపవతీభర్త కేపు మీఱ


గీ.

నరసి చూడ మహాంతరం బయ్యె నప్పు
డిత్తెఱంగున నయ్యదుసత్తముండు