Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నవ్వైనతేయుండు విజృంభమాణశరీరుండై యనేకగరుత్మంతుల
సృజించిన నవి యసంఖ్యాతంబులై కృష్ణనామం బుచ్చరించుచు
నాకాశంబున కెగసి సువర్ణవర్ణవర్ణరుచులు సూర్యకిరణంబులం
గలసి గగనంబంతయు స్వర్ణమయంబుఁ జేయుచు.

217


సీ.

శతకోటిసంకాశశాతనఖంబులఁ
                        దలలు చిందఱపాఱఁ దన్ని తన్ని
శితచంచుపుటములఁ జించిచెండాడి ర
                        క్తము గ్రోలి ఖండలు నమలినమలి
యాతతపక్షసంజాతఝంఝానిల
                        చాలనంబునఁ దూలఁ దోలితోలి
పక్షవిక్షేపసంభవభూపరాగంబు
                        చేత నంధులు గాఁగఁ జేసిచేసి


ఆ.

చైద్యముక్తఘోరసర్పాస్త్రసంభూత
వివిధదందశూకవిసరములను
హరివిముక్తగారుడాస్త్రజగరుడసం
దోహ మపుడు పట్టి తునిమివైచె.

218


వ.

ఇట్లు వైనతేయగణంబులచేత సర్పసంఘంబు హరిస్మరణాది
పుణ్యంబులచేత బ్రహ్మహత్యాదిమహాపాతకంబులుంబోలె నశించె
హతశేషంబులైన కొన్నిసర్పంబుల ఖగేంద్రపతత్రసమీరణ
బలాత్కారోన్మూలితశైలదత్తవివరమార్గంబున వివశంబులై
స్వకీయస్థానం బైన పాతాళంబు ప్రవేశించె నిట్లు తననాగాస్త్రంబు
మోఘంబై న శిశుపాలుండు లజ్జితుండై పదంపడి రోషవిశేషం
బున సమంత్రకంబుగా నాగ్నేయాస్త్రంబు ప్రయోగించిన నది
పొగలేని మంట లుమియుచు విస్ఫులింగపటలీసంచారఘోరంబు
గా వితతాయతజ్వాలాబాహుం డైనబేతాళునిపగిది నాకాశం
బున కెగసి చలితోన్నతధూమకేతనుండును సరభసరభసాంబర
రోహిరోహితవాహుండును శీఘ్రమారుతసారథియు నైన పావ