Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నీరధిమధ్యమందు మును నిద్దురవోయెడు ప్రోడయయ్యు నిం
పార స్వసైన్యవార్థిగతుఁడై భువనత్రయరక్షణంబునన్
వారక జాగరూకుఁడయి భాసిలు నాదిమపూరుషుండు ల
క్ష్మీరమణుండు జన్యజయశీలుఁడు మేల్కొనియుండె నత్తఱిన్.

211


చ.

అనువుగ నే మహాత్ముని సమంచితనామము నుచ్ఛరించినం
తనె చిరకాలభుక్తభవదారుణపాపతమం బడంగు న
వ్వనరుహపత్రలోచనుని స్వాపనబాణతమంబు గ్రమ్మునే?
దినకరు నాక్రమించుటకుఁ దీవ్రవిశోత్థతమంబు చాలునే.

212


సీ.

అప్పుడు హరిచాక్షుసాద్భుతతేజంబు
                        తపనతేజముభంగి విపులకౌస్తు
భాదర్శమందు నొయ్యన సంక్రమించిన
                        నందు దుర్వారసర్వాంధకార
నిరసనక్షమ మైన నిరుపమధామంబు
                        పొడమె నాలోకవిభుండు భాస్క
రాబ్జనేత్రుఁడుగదా! యమ్మహామణిదామ
                        నిచయంబు వికసితనేత్రసైన్య


గీ.

సమితివలనన నావిలచారుదర్శ
నంబు నట్లనె జ్ఞానంబు నపు డొసంగె
భవ్యమతులప్రసాదంబు భక్తులందు
బోలె దిశలందు వ్యాపించుఁ బొలుపు మీఱ.

213


క.

దిననాథుం డుదయించిన
జనములు తెలి వొందినట్లు స్వాపనశరసం
జనితతమము విడిచినఁ జ
య్యన హరిసైన్యంబు లేచి యనికిఁ గడంగెన్.

214


వ.

ఇట్లు స్వాపనాస్త్రంబు న్యాయవాదంబునందు మిథ్యాభిశంస
నంబునుంబలెఁ గౌస్తుభమణితేజంబున నిష్ఫలంటైన నాగాస్త్రంబు
ప్రయోగించె నంత నయ్యస్త్రప్రభావంబునఁ గరాళవక్త్రంబులై
దీర్ఘపృష్ఠంబులై కోఱలవలన నశ్రాంతంబు విషంబు గ్రక్కుచుఁ
జంచలరసనాద్వయాస్వాదితోభయపార్క్వోష్ఠ ప్రాంతదేశంబులు