Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేహుండై యుభయప్రకారంబుల ననూరుండునుంబోలె
నరుణవర్ణవిగ్రహుండై చూడంబడియె.

157


చ.

శరధిసమాహవంబున విశాలసమేధితతేజుఁడైన దు
స్తరబలవీరుఁ డొక్కఁ డల దక్షమహాహవమందు దీప్తదు
ద్భరపృథుతేజుఁడై దనరు రాజకిరీటుని భూరికోపమై
వఱలెడు వీరభద్రుక్రియ వారక పొల్చెను దుర్నిరీక్ష్యుఁడై.

158


చ.

పరభటహస్తదీప్తకరవాలవిలూననిజోరుఖడ్గులై
వెఱవున నట్టె పోక కడుభీషణభంగిఁ గరాళవక్త్రులై
పరఁగఁ బదాతులున్ గినుక పర్వ వడింజని బల్ రదంబులన్
బరువడిఁ బెందలల్ గొఱికివైచిరి బెబ్బులులట్ల బల్విడిన్.

159


వ.

అధిపుచే మున్ను సత్కృతు లైనయోధు
లతనిఋణ మీఁగుటకుఁ జచ్చి రాజిలోనఁ
గడఁగి బతిచేత సత్కృతుల్ గానివారు
కనలి గెడసిరి వారలకన్నమున్నె.

160


వ.

భాగ్యవంతంబును దేజస్విత్వంబువలన దుర్నిరీక్ష్యంబును గుపి
తంబును రణార్థియు నైన వీరలోకంబునందుఁ బత్యనాదర
నిమిత్తాపయశోనివర్తకం బైనయుపాయంబు మరణంబున
కంటె నెయ్యది లేదని నిశ్చయించి శాక్తికులచేత నైశిత్యంబు
వలన నెందును ప్రతిహతంబు నొంద నదియు నభ్యగ్రఫలశాలి
నియు నయోమయయు నైనశక్తి పగతులయందు విడువం
బడియెం గాని శరీరంబువలనం బుట్టినశక్తి విడువం బడదయ్యె
రాజుల వ్యసనంబునందును నీతి విడువక పృతనచేతనమాను
షంబైన రణంబు గావించి రప్పు డయ్యుద్ధంబు జూచి యంతరి
క్షవర్తిసిద్ధవిద్యాధరాదిజనసంఘంబు విస్మయంబు నొందె.

161


సీ.

త్రిణతచాపంబులు గణికలకైవడి
                        బలుశరంబులఁ గాముకులనుబోలె
నిజగుణంబులచేత నెఱిఫలప్రాప్తిప
                        ర్యంత మాకర్షించి యవల విడిచె
రయమున నేగు గుఱ్ఱంబులు పక్షవం
                        తము లైన శరము లేకముగ బెరసి
యారబ్ధనవయుధమైన శాత్రవసైన్య
                        మందుఁ బ్రవేశించె నద్భుతముగఁ