Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంక్రమించియు సైన్యసమితిచే విభజింపఁ
                        బడకుండె మత్సరోత్పాతవాత
సంయుజ్యమానోరుచారుదంతమహీజ
                        సంఘర్షణోద్ధూతసాంద్రసన్నా


గీ.

శిఖలచేతఁ గల్పాంతాగ్నిశిఖలచేతఁ
బోలె దంతావళోన్నతమూర్ధగగన
మందు నుజ్జ్వలనక్షత్రహార మపుడు
వితతముగ దగ్ధమయ్యె నద్భుతము గాఁగ.

107


సీ.

సాంద్రపయోదమేచకదంతిబ్బం
                        దంబునందు నిబిడశోణితారుణంబు
లైనదంతంబు లుద్యద్వారినిధివారి
                        యందు విద్రుమలతికాంకురముల
యట్లఁ బొల్చెఁ బ్రకంపితాగ్రకేతువులచే
                        భారంబు నొందిన వారణములు
చెలఁగి గ్రీవాబద్ధశృంఖలభూష
                        ణాద్యఖిలనినాదంలు లలరునట్లు


గీ.

ప్రతిగజంబుల భూరిగాత్రంబులందు
నధికగాఢనిమగ్నంబు లైనస్థూల
దీర్ఘదంతద్వయంబు నతిప్రయాస
మలర నుత్ఖాత మొనరించె బలుపుచేత.

108


వ.

మఱియు లాంగలదండసంకాశదంతంబులు గల యొక్కమహా
గజంబు ప్రాణోత్క్రమణదుఃఖంబువలనఁ జలింపుచున్న శాత్ర
వీయకుంజరంబును దంతంబులచేత మీదికెత్తి శిఖరప్రాంత
ప్రావృట్కాలజలధరం బైన మహీకరశృంగంబునకు సాదృ
శ్యంబు నొంచె మఱియు నొక్కవారణంబు క్రోధావేశంబున
నిర్భీకంబై రయంబునం బఱచి యతివిపులంబయ్యును లోక
వ్యాప్తం బగుటంజేసి మిక్కిలిదుఃఖలభ్యాపసరణంబగు సేనా
మధ్యంబు సృష్ట్యర్థంబు సృష్టివిలోకనార్థంబు బ్రహ్మయు
మార్కండేయుండు భగవంతుని కుక్షింబోలెఁ బ్రవేశించి
పరిభ్రమించి మఱియు నొక్కదంతావళరాజు మధువ్రత
రాజీశ్యామనారాచవిద్ధనీరంధ్రదేహం బయ్యును నిర్భయం
బుగా రణరంగంబునందు నవ్యాహతోత్సాహం బగుటం
జేసి మోదమానంబై హర్షపులకితంబైనదానియట్ల సం
చరించె.

109