అప్పుడు క్షణమాత్రం బగ్రభాగంబున విలోకింపుచున్న తనుకుక్షి
స్థితభువనత్రయుండైన మధుసూదనుని విశాలనితాంతాయత
నేత్రంబునందుఁ దద్విపక్షమహాబలం బపర్యాప్తం బయ్యె మహీ
నాథసేనావధూగణంబులు రణారంభంబునందు సురతారంభంబు
నందుంబోలెఁ బ్రస్విన్నగాత్రంబులును బులకవికాసితంబులును
వీరశృంగారరసాధికంబైనచిత్తంబునం దభినివిష్టసాహసంబులు ను
పసంభ్రమంబులునై జూప మఱియు శిశుపాలపక్షరాజు
లనుకూలమారుతప్రసారితకేతనపటంబులచేతఁ బలాత్కారంబు
గాఁ గృతాహ్వానులైనచందంబున ధృతతరంబుగా సముద్యత
శస్త్రాస్త్రు లగుచుఁ గోపంబున నత్యంతసంరంభంబు నొందిరి ధీరు
లగువారు రణార్ధులై చనుదెంచినవారిం జూచి కాలవిలంబనంబు
సహింపరు గావున నప్పుడు హరిసైనికులు శత్రువాహినిమీఁద
నతిరయంబున నడరి రంత.