Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు నిమ్మహాత్ముని సర్వజ్ఞునిఁగా ననాదినిధనుం డయ్యును
బ్రాణుల ననుగ్రహీతుకాముండై భూభారనివారణార్థంబు
మానుషవిగ్రహంబు ధరించినవానిఁగాఁ గ్లేశకర్మఫలభోగ
వివర్జితుండైన పరమపురుషునిగా పెద్దలు జెప్పుదురు. భక్త
వత్సలుండైన యీకృష్ణునం దనురాగవంతులైన జనంబులు నిరం
తరధ్యానక్షీణపాపు లగుచు ననుభూయమానంబైన సంసార
క్లేశనాటకాభినయవిధినిర్వహణఃలు బ్రాపింతురు. మూఢులగు
వారు గ్రామ్యభావంబు విడిచి మోక్షార్థులై పునరావృత్త్య
భావంబుకొఱకు దుష్ప్రావుండు నద్వితీయుండు స్వతంత్రుఁడు
నగుయీకృష్ణుని ధ్యానమార్గనిష్ఠంబైన మనంబుచేత ధ్యానంబు
సేయుచుండుదురు.

216


చ.

పొలుపుగఁ బ్రాణికోటులకుఁ బుట్టువు చావును గల్గఁజేయుచున్
నలువుగఁ దాను పుట్టువును నాశము లేక యపాయమొంద క
ట్లలరు నధోజగంబు కమఠాకృతిచేతఁ ద్రివిక్రమాకృతిన్
నలువ జగంబు నిండిన యనంతున కేను నమస్కరించెదన్.

217


వ.

మఱియు సృజతిసంహృశాస్తు లనుధాతువు లీ భగవంతుని
విషయంబునం దనన్యయోగవ్యవచ్ఛిన్నంబు లగునట్లుగాఁ గర్తృ
కారకవాచకంబులైన ప్రత్యయంబులను ధరింపుచున్నవి
యొకానొకప్పుడైనఁ గర్మార్థవిహితంబులైన ప్రత్యయంబుల
ధరింప వింక నేమనిన స్తౌతి యనుధాతువు విపరీతకారకంబై
కర్మప్రత్యయాంతంబె యగుచున్నది గాని కర్తృప్రత్యయాం
తంబు గానేరదు.

218


సీ.

మొదలు నీ భగవంతుఁ డుదకంబుల సృజించి
                        యందు నాత్మీయవీర్యంబు నునిచె
నది హిరణ్మయమైన యండమై విలసిల్లె
                        నందుఁ జతుర్ముఖుం డవతరించి
సకలజగంబుల సమ్మతి సృజియించె
                        నింతటికిని మూల మివ్విభుండె
క్షీరవారాశిలో శేషాహిశయ్యపై
                        యోగనిద్రారతి నున్నవానిఁ


గీ.

దొడరి మధుకైటభాఖ్యులు దుష్టచిత్తు
లాదిరాక్షసు లిద్ద రత్యాగ్రహమున