Jump to content

పుట:శిశుపాలవధము (గోపినాధ వెంకటకవి).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆరూఢుండయి వెన్కవచ్చు జనమున్ వ్యాప్తిం బ్రతీక్షించు దో
స్పారోదంచితసాదిచేత మిగులన్ సంస్థాపితంబయ్యు దా
పేరంబువ్ బిచుమందపత్రములు భక్షించె న్వడిం బోయి; స
చ్చారిత్రంబును దాక్ష్యమున్ జగతిలో సద్యఃఫలంబే కదా!

82


మ.

హరిసైన్యంబు ప్రతాపదీపితములై ప్రాప్తప్రమోదంబుకై
యిరుపార్శ్వంబులఁ గూడి నమ్రతనులై హేలాగతిన్ వచ్చు ని
ర్భరనానావనిరాట్సమూహములచే బహ్వాతపత్రాఢ్యమై
కరమర్థిం గననయ్యెఁ జూడ్కులకు నేకచ్చత్రమైనట్లుగాన్.

83


గీ.

వెంటవచ్చుకరటి ఘంటాధ్వనులు విని
యదరుచేత వ్యాకులాంగనులగు
సైన్యచరులు భారసంచయంబులతోడఁ
ద్రోవ విడిచి యొండుత్రోవఁ జనిరి.


వ.

అప్పుడు స్తుతిపాఠకులు తేజస్వివర్ణోజ్జ్వలవృత్తశాలియు సుప్ర
సాదియు నత్యక్తగోత్రసంవిదుండునగు మురారిగుణంబుల
నధికరించి పద్యంబులఁ జదువుచుఁ బురోభాగంబునం జనుచుండిరి
మఱియుఁ గల్ఫాంతక్షుభితంభై సముద్రంబు సలిలంబుచేత నిమ
జ్జితాశేషభూగోళంబై వేలాలంఘనరూపమర్యాద నతిక్రమించె
మాధవుండు ప్రచలితుండయ్యు నపరిమితసైన్యంబులచేత నిశ్శే
షంబుగా నాక్రాంతమహీతలుండయ్యును గ్రామాదికంబును బరి
త్యజింపుచు మర్యాదాపాలనంబు గావించె మఱియుఁ బటోలీ
పుష్పగుచ్చసచ్ఛాయముఖోపలక్షితలును వికసితవిపులబాణపు
ష్పసమానలోచనలగు గ్రామ్యకాంతలు వల్లికాతిరోహితగాత్ర
లగుటం జేసి చమూచరులచేత నలక్షితలై కృష్ణుండు గ్రామం బ
తిక్రమించునందాఁకఁ గంటక శాఖావరణోపరితనావకాశంబునం
దు విలోకింపుచుండిరి మఱియు గోష్ఠప్రదేశంబులందు గోష్ఠీకృత
మండలాకారోపవేశనులై క్ష్వేళాట్టహాసనినాదసహితం బగునట్లు
గా శీఘ్రంబునలేచి కాపిశాయనపానేచ్ఛులై నిజనామసంకీర్తన
ప్రవర్తితచిత్తులైన ఘోషజనుల విలోకింపుచుం జనియె నంత.

85