శ కు న శా స్త్ర ము
19
తా. ఓ నరసింహస్వామి! ఆఱు అను పదము విన్న శ్రేయస్క
రము ఏడు అను పదము వినిన జగడము, ఎనిమిది అను పదము విన్న
మరణము తొమ్మిది అను పదము విన్న ధనలాభము శుభము కలుగును,
క. పది సంపద, బహు గెలుపగు
పదునొక్కట, చావునిజము | పది రెండైతే
వదమూడు పలుకులై తే
చెదరును తా నున్నస్థలము | శిఖినరసింహా.56
తా.ఓ నరసింహస్వామి! పది యను పదము విన్న సంపద,
పదకొండు అను పదము వినిన గెలుపు, పన్నెండు అను వదము వినిన
చావు. పదమూఁడు అను పదము వినిన స్థానభష్టతయు గల్గును.
క. మును పాండు రాజతనయులు
నను వగు రాజ్యంబు విడిచి | యడవికి జని
రొయ్యన బద మూఁడగు పలుకులఁ
జిన యోబళగిరి విహార | శిఖినరసింహా,57
తా. చిన యోబళగిరియందు విహరించే యో నరసింహస్వామి!
పదమూఁడను వదము వినుటవలన పాండవులు వురిని విడిచి యడవికి
బోయిరి.
క.పదినాల్గు మేలుఁ బది హే
న్వదలక సీతాంగనయును | వడి చెఱబోయెన్
[1] పదు నాఱిట హనుమంతుఁడు
చెదరక నయ్యబ్ధిదాటె | శిఖినరసింహా,58
తా. ఓ నరసింహస్వామీ! పదునాల్గు అను పదము విన్న మేలు,
పదిహేనను పదము వినుట చేత సీతాదేవి చేఱబోయెను. పదహారను
వదము వినుటచేత హనుమంతుఁడు సముద్రమును దాటెను.
- ↑ పదహారు వాయునూనుఁడు పాఠాంతరము,