Jump to content

పుట:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

అన్నమాచార్యచరిత్ర

నన్నమయ పాడెను. తిరుమలాచార్యుఁడుగాఁబోలును అన్నమాచార్యు సంకీర్తనముల నిట్లు సన్నుతించెను.


            సురలకు నరులకు సొరిది వినవిన ।
            అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు ॥పల్లవి॥

చక్కెరై చవిచూపీ జాలై తావి చల్లీ ।
నక్కజపుమాఁతు వజ్రాలై మెఱసీని ।
నిక్కుటద్దములై మానిలువు నీడలుచూపీ ।
నక్కరతాళ్ళపాక అన్నమయ్య పదములు ॥సుర॥ 1

పన్నీరై పైఁబూసీఁ గహ్రంబై చలువ రేఁచీ ।
మిన్నగల ముత్యము లై మెయినిండీని ।
వెన్ను బలములై మావెంట వెంటఁ దిరిగీని ।
అన్నిట తాళ్ళపాకాన్నమయ్య పదములు ॥సుర॥ 2

నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ ।
పుట్టుతోనె గురువులై బోధించీని ।
గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాథుని మెప్పించీ ।
నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు ॥సుర॥ 3
                                                  శేషా, వ్రాఁతప్రతి.


వానిని విని యానందపరవశుఁడై నరసింహరాయఁ డాచార్యునిఁ జాల సత్కరించెను. పచ్చలకడియాలు మొదలుగా నాభరణాంబరాదులొసఁగెను. అన్నమాచార్యుల కాలముననే తాళ్ళపాకవారికి అగ్రహారములెన్నో ఉన్నట్టున్నవి. ఏలనఁగాఁ దత్పుత్రుఁడు పెదతిరుమలయ్య చాలా అగ్రహారములను స్వామికి సమర్పించెను. అందుఁ గొన్నియేని యన్నమాచార్యుఁడు నరసింగ రాయాదులవల్ల నార్జించి యుండును. అన్నమాచార్యచరిత్రలో 43 పుటలో నిట్లున్నది. "వెంకటాద్రిచెంగటను తనయగ్రహారమైతరచునున్న [1]మరులుంకు (?) నొకజీడిమామిడి దాన॥
  1. ఇది “మరువాకర” కావచ్చును. ఈ పేరియగ్రహారమును అన్నమాచార్యుల కుమారుఁడు పెదతిరుమలాచార్యుఁడు స్వామికి సమర్పించెను.