ఈ పుట అచ్చుదిద్దబడ్డది
262
అన్నమాచార్యచరిత్ర
విజయనగరరాజ్యపు విప్లవ (విరూపాక్ష చంద్రశేఖరరాయల) కాలమున గాఁబోలును కపిలేశ్వర గజపతి యొకమాఱును, పురుషోత్తమ గజపతి యింకొక మాఱును విజయనగరము మీఁదికి దండెత్తి వచ్చిరి. తొలితూరి కొంత కప్పము చెల్లించి విరూపాక్షరాయఁడు గాఁబోలును విజయనగరమును రక్షించుకొనెను. రెండవతూరి పురుషోత్తమ గజపతికి సాళ్వనరసింహరాయఁడుదయగిరి రాజ్యమున నొసంగి విజయనగరమును గాపాడఁగలిగెను.
కపిలేశ్వరజగపతి : -
ప్రసహ్య కర్ణాటమహేపతేః పురీం నిరుధ్య విద్యానగరీం నిజైర్బలైః
సమున్నతం మానమివోచ్ఛ్రయంకరం సమాదదే కర్కశచక్రవిక్రమః
పురుషోత్తమగజపతి :-
యస్మై నిత్యతరప్రతాపదహన జ్వాలాయమానధ్వజ ।
స్తంభాబద్దకుసుంభరక్తవసన ప్రేక్షావిభగ్నద్విషే ।
సంధాయాభయయాచానాంజలి మహోదత్వోదయాద్రింభయా
దాత్మానం ముముచే నృసింహనృపతిః కర్ణాటదేశాధిపః॥[1]
చరిత్రకారు లీ సందర్భము నిట్లు గుర్తించిరి.