పుట:విక్రమార్కచరిత్రము.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

విక్రమార్కచరిత్రము


వ.

అదియునుంగాక యానీరజానన నెవ్వండు వరియించె నతండు సార్వభౌముం డగుట సిద్ధంబు గావున నౌదార్యవీర్యభుజశౌర్యసకలకళాచాతుర్యధైర్యధుర్యుండ వైననీకు నమ్మత్తకాశిని పట్టపుదేవియైన, రత్నకాంచనసాంగత్యంబునుంబోలె నత్యంతశోభితంబగు నని చెప్పిన.

29


ఉ.

యోగివరేణ్య మీకృపఁ బయోరుహలోచనచెయ్యి చూడ నే
లాగున నాకుఁ జేకుఱు, విలాసినిహస్తము నాకరంబు నే
లాగునఁ గీలితం బగుఁ గళావతి పుష్పపురంబులోని కే
లాగున నేను జేరుదుఁ దలంపఁగ దుష్కరభంగు లిన్నియున్.

30


వ.

అదియనుంగాక, యాబింబోష్ఠ మౌనవ్రతనిష్ఠాగరిష్ఠ యైయుండ హృదయపుటభేదనంబు గావించి, మూఁడుమాటలు పలికించుట యత్యంతదుర్లభంబని తలంచెద, నన్న నమ్మానవేశ్వరునకు సమానుషచరిత్రుండైన యాసదానందుండు కృపానందకందళితహృదయారవిందుండై, దారుశిలాలోహాదులకైనను చైతన్యంబు గలిగించి పలికించెడినేర్పు గలుగునట్లుగా విద్యోపదేశంబు చేసి, యాశ్రితానేకసిద్ధగణపరివృతుండై యంతర్జానంబు నొందె సంత విక్రమార్కుండును దత్కరలతాసందర్శనకుతూహలావేశంబునఁ జిత్తం బుత్తలపడ నిజప్రధానాగ్రగణ్యుండును నాప్తుండును నైన భట్టి మొదలుగాఁగల వారికి నెవ్వరికి నెఱింగింపక, నిజకరకీలితనిశితాసియసహాయంబుగా నర్ధరాత్రంబున యోగపాదుకలు దొడిగి కదలి, మనోవేగంబున ననేకశైలంబులు నరణ్యంబులు దఱిసి, లాటదేశంబునకుం జని యరణ్యమధ్యంబున.

31


విక్రమార్కుఁడు నాగకన్యకను జూచుట

ఉ.

శ్రీకరమూర్తి యానృపతిసింహకిశోరము గాంచె నొక్కవ
ల్మీకము సంతతప్రకటలీనవధూకరకంకణప్రభా
నీకము, వేష్టితామలకనింబకదంబతమాలవిద్రుమా
శోకము, రంధ్రమార్గపరిశోభితగోచర నాగలోకమున్.

32


తే.

కాంచి తిలకించి పులకించి కవియ నేఁగి
సమణికాంచనకంకణోజ్జ్వలితమైన