పుట:విక్రమార్కచరిత్రము.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

విక్రమార్కచరిత్రము


వ.

అక్కన్యకాజననసమయంబున.

20


సీ.

ఎలజవ్వనమున నియ్యిందీవరేక్షణ
        భూలోకమున వనభూమిలోన
వల్మీకబిలమధ్యవాసినియై యుండి
        కరపంకజము తదగ్రమున నిల్పి
యాకేలు గేల నెయ్యమునఁ గీలించిన
        పురుషునిఁ దనపుష్పపురికిఁ దెచ్చి
యతని మజ్జనభోజనాదుల నలరించి
        మేలిపర్యంకంబుమీఁద నునిచి


తే.

తాను నొకశయ్య శయనించి మౌననియతి
నుండ, ముమ్మాఱు పలికింప నోపెనేని
వాడు రమణుండు గాఁగలవాఁడు దీని
కనుచు నాకాశవాణి యిట్లనితిచ్చె.

21


చ.

లలితకళావిశారద కళావతికే లది దాని నెవ్వఁడే
బొలుపుగఁ బట్టెనేని తన పుష్పపురంబునకుం గరంబు మె
చ్చులుగఁ గరంబు వట్టికొనుచుం జని యాతఁడు తన్ను మూఁడుమా
టలు పలికింపఁ దక్కును దృఢంబుగఁ, దక్కదు లేక తక్కినన్.

22


వ.

అని చెప్పి యోగీశ్వరుండు ధరణీశ్వరున కిట్లనియె.

28


తే.

ఆకళావతి సౌందర్య మసమశరుఁడు
ఎసఁగఁ జెప్పినఁ బొసఁగుఁ గా కితరజనులు
మించులావణ్యరస మొకయించుకైన
నొలుకకుండఁగ వర్ణింపఁ గలరె జగతి.

24


సీ.

అమృతాబ్ధిజనితమై యలరుకల్పకలత
        యంగనతనులత కనుగుణంబు
పుండరీకాక్షునిపొక్కిటితమ్మికి
        సతిమోమునెత్తమ్మి సంగతంబు