పుట:విక్రమార్కచరిత్రము.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

205


సీ.

ఆదినాథునియపరావతారము పూని
        మత్స్యేంద్రనాథునిమహిమఁ దనరి
సారంగనాథునిసామర్థ్యమును బొంది
        గోరక్షనాథునిగుణముఁ దాల్చి
సిద్ధబుద్ధునిబుద్ధి చిత్తమునం జేర్చి
        ఖనిరువిద్యాధికఘనతఁ బేర్చి
మేఖనాదునిమంత్రవైఖరి వహియించి
        నాగార్జునునికళాశ్రీ గమించి


తే.

యావిరూపాక్షుఁ డితఁడన నతిశయిల్లి
యర్థి నవనాథసిద్ధుల కైక్యమైన
మోహనాకృతి యితఁడనుమూర్తిఁ దనరి
చిన్మయస్వాంతుఁ డగునొక్కసిద్ధవరుఁడు.

4


ఉ.

పాదములందు బంగరపుఁబావలు పెట్టి, దుకూలకంథమై
మోదముతోడఁ దాల్చి, జనమోహనమారణధాతువాదయం
త్రాదిసమస్తవిద్యల సమర్థు లనం దగుశిష్యపంక్తి య
త్యాదరలీల నిర్మెయిలయందుఁ దనుం గొలువన్మహోన్నతిన్.

5


క.

వచ్చి తగుచందమున సభఁ
జొచ్చి, మహీకాంతుఁ జూచి సుభగాకృతికిన్
మెచ్చి తలయూఁచి, కానుక
తెచ్చినరత్నంబుతోడ దీవన లిచ్చెన్.

6


ఉ.

ఇచ్చిన సిద్ధవల్లభున కిమ్ముల నాసనపాద్యసత్కుృతుల్
పొచ్చెము లేకొనర్చి నృపపుంగవుఁ, డెయ్యది మీకుఁ బేరుఁ తా
రెచ్చటు, నేను జేయుపని యెయ్యది? భాగ్యయుతుండ నైతి మీ
వచ్చుటఁ జేసి భక్తజనవత్సల! యన్న దరస్మితాస్యుడై.

7


క.

ఇందందుండుదు ననలే
కెందైనఁ జరింపుదును నిజేచ్ఛమెయి, సదా