పుట:విక్రమార్కచరిత్రము.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

199


క.

మీ రాహారార్థముగా
గోరి చరింతురు సమస్తఘోరాటవులన్
దూరగ్రామంబుల ఫలి
తారామంబులను దశదిశాంతరములలోన్.

199


తే.

కన్నచోద్యంబు లేవేని గల్లెనేని
నాకు నెఱఁగింపుఁ డేను వినంగవలతు
ననిన నందులో నబ్బరికాభిధాన
మొకపతత్రి యిట్లనియె, నేఁ డుదయవేళ.

200


క.

ఏ మొకకొందఱము మహా
గ్రామవనాంతరము లెల్ల గడచి చని, గ్రహ
స్తోమగతిప్రతిరోధన
భూమావంధ్య మగువింధ్యముసమీపమునన్.

201


క.

చైత్రరథనందనంబుల
చిత్రస్ఫురణముల నుల్లసిల్లుఁ బ్రశంసా
పాత్రమయి యొక్కవిపినము
చైత్రరమాకాంతజన్మసదనం బగుచున్.

202


వ.

అవ్వనంబున వన్యఫలాహరణార్థంబు సంచరించుచు, నొక్కయెడం గమలకల్హారకుముదశోభితంబును గలహంస కారండవ గ్రౌంచ చక్రవాక సారస మదసారంగ సంకులారావవిరాజితంబును నగునొక్కకమలాకరంబుతీరదేశంబున, ననేకబంధులోకపరివృతుండును దీర్ఘనిశ్వాసపవనధూళిధూసరితుండును గళద్భాష్పనయనకమలుండుమ దురంతదుఃఖపరవశుండునునై యున్న కంకాళఖండనుం డనునొక్కవిహంగపుంగవుం గని చేరంజని, తన్నెఱఁగించుకొని దుఃఖకారణం బడిగిన నతం డెట్టకేలకుఁ జిత్తంబు కలంకదీర్చుకొని యీరెలుంగున నాతో నిట్లనియె.

203


తే.

ద్వాదశగ్రామములకు నధ్యక్షుఁ డొక్క
రాక్షసుఁడు వింధ్యనగగహ్వరమున నుండు