పుట:విక్రమార్కచరిత్రము.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

193


వ.

తండ్రి వీడ్కొని మహీమండలమండనం బైనకాశ్మీరమండలంబునకుం జని, యందు సరస్వతీవిహారసదనంబునుంబోని యొక్కమహాగ్రహారంబున సన్నిహితచంద్రజూటుండగు చంద్రచూడుం డనువిద్వచ్చూడామణిపాలికిం జని నమస్కరించి, తనయభిలాషంబు నెఱంగించి దేవతానిర్విశేషంబుగాఁ బరిచర్య సేయుచుండ, నతని సేవాతాత్పర్యంబునకు సంతసిల్లి సిద్ధసారస్వతమంత్రం బుపదేశించె, నంతం దదనుష్ఠానవిశేషంబునకు శారద ప్రత్యక్షంబై యతని సముచితవిద్యావిశారదుం గావించిన, లబ్ధకాముండై పితృదర్శనప్రీతి గురునియుక్తుండై యుజ్జయినీపురంబునకు వచ్చి నిజమందిరంబు ప్రవేశించి.

163


చ.

జనకునిఁ గాంచి భక్తిభయసంభ్రమసంభృతుఁడై నమస్కరిం
చిన, నతఁడెత్తి నందనునిఁ జిక్కఁ గవుంగిటఁ జేర్చి పెక్కుదీ
వనలొనరించె, ముత్పులక వారము సమ్మదబాష్పపూరముం
దనరఁగ సమ్మదం బొదవదాల్చినలీల వికాసలక్ష్మితోన్.

164


వ.

అమ్మఱునాఁడు.

165


ఉ.

భూవరుసమ్ముఖంబునకుఁ బోయి ప్రసన్నతఁ గాంచి, యింపుమైఁ
గోవిదవర్ధనీయ మగుగోష్టి యొనర్చిన, నవ్విభుండు మో
దావహచిత్తుఁడై యభిమతార్థపరంవర లిచ్చి యమ్మహీ
దేవకుమారచంద్రమునిదిక్కు గనుంగొని ప్రీతి నిట్లనున్.

166


తే.

ఈవు బహుదేశములఁ జరియించి యచ్చ
టచట నేమేమిచోద్యంబు లనఘచరిత
కనినవినినవి క్రొత్తలు గలిగెనేని
నాకుఁ జెప్పుమ యనఁ గమలాకరుండు.

167


నరమోహినీవృత్తాంతము

క.

పరిచితవిద్యానిధినై
గురునాథునిచే ననుజ్ఞ గొని యిట మిమ్మున్
దరిసించు నభిమతంబున
నరుదెంచుచునుండి మండలాధిప యంతన్.

168