పుట:విక్రమార్కచరిత్రము.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

191


వ.

అని కలుషించి దండింపం దలంచి.

148


ఆ.

కొలువువెడల నీడ్చికొనిపోవ నతిసంభ్ర
మమున విక్రమార్క మనుజవిభుఁడు
వారి మగుడ బిలిచి వలదని వారించి
యెల్లవారు వినఁగ నిట్టు లనియె.

149


క.

మున్నొకపురుషార్థము మది
నెన్నడు మఱవంగ రాని దితఁ డొనరించెన్
నన్నును నే నెఱుఁగక పడి
యున్నెడ వనభూమి శీతలోదక మొసఁగెన్.

150


ఉ.

కావున నీతఁ డెంతయపకారము చేసిన సైఁపఁ బాడి, యే
నావిపినంబు వెల్వడికదా పురికిం జనుదెంచి రాజనై
యీవిభవంబుమై మనుట, యెంతటి తప్పిది? నాకుఁ దప్పినన్
దైవముసాక్షి యీతనికిఁ దప్ప నొకింతయు, మాట లేటికిన్?

151


ఉ.

ఆపద చక్కఁబెట్టి తనయక్కఱలెల్లను దీర్చి, యెయ్యెడం
బ్రా పయినట్టికార్యములపట్టున నిర్వహణం బొనర్పఁగా
నోపి, తను న్భరించినబుధోత్తము నొప్పరికించు నమ్మహా
పాపికి నెన్నిజన్మములఁ బాయునొకో క్రిమికీటజన్మముల్!

152


ఉ.

నావుడు రాజుసభ్యవచనంబున కెంతయు సంతసిల్లి, భూ
దేవుఁడు మందిరంబుసకు దిగ్గనఁ బాఱి కుమారుఁ దెచ్చి, ధా
త్రీవరు నంకపీఠి నిడి దీవన లొప్పఁగ నిచ్చి తత్సఖా
కోవిదకోటిడెందమునకుం బ్రమదంబు జనింప నిట్లనున్.

153


ఉ.

దేవర నేఁడు కొల్వున మదిం గడునెంతయు సంతసించి, సం
భావనమీఱ నాకు నొకప్రత్యుపకారము సేయఁబూనుటే
నావల నీవల న్విని, యథార్థ మెఱుంగుటకై యొనర్చితిన్
నావెడబుద్ధికి న్మనమునం గలుషింపకుమయ్య వేఁడెదన్.

154