పుట:విక్రమార్కచరిత్రము.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

విక్రమార్కచరిత్రము


యుచ్చైర్నినాదం బగునాశీర్వాదంబు చేసె. తదనంతరంబ సాహసాంకమహీవల్లభుండు.

128


క.

అక్షీణదానలీలా
దక్షుండై ఋత్విజులకు దశగుణితముగా
దక్షిణ లొసఁగెను నుత్తమ
పక్షమున దశాశ్వమేధఫలతత్పరతన్.

129


క.

హాటకములు దక్షిణగా
గోటానంగోటు లొసఁగి కుంభినియెల్లం
బాటించి దారవోసెను
హాటకగర్భప్రభావుఁ డగువరరుచికిన్.

130


వ.

అతఁ డమ్మహీదానప్రతిగ్రహానంతరంబున నమ్మహీకాంతున కిట్లనియె.

131


ఉ.

దానఘనుండ వౌట మఘదక్షిణగా ధర యెల్ల నిచ్చితీ
వేనది విప్రవర్గమున కిచ్చితి, నీవు భుజాగ్రపీఠికం
బూని ధరించుభూతలము భూసురకోటి భరింపనేర్చునే?
యేనుఁగుపల్లనం బిడిన నేడికకున్ వశమే వహింపఁగన్.

132


శా.

ఉర్వీమూలము కోటికోటుల ధనం బొప్పించి విప్రాళిచే
సర్వక్షోణియు నీవు గైకొనుట కర్హం బన్న, నాయన్నయం
తర్వాణిత్వము మెచ్చి భూవిభుఁడు తద్వాక్యంబు చెల్లించి, మున్
"గుర్వాజ్ఞాం ప్రతిపాల యే"త్తనెడి పల్కుల్ బుద్ధిఁ గీలించుచున్.

133


ఉ.

చిత్రతరంబు లైనయవశిష్టధనంబులు, రాగమంజరీ
పుత్త్రుఁడు సత్కృపామహిమఁ బూనినచూపులఁ జూచి దానవై
చిత్రి యెలర్ప నిచ్చుటయు జిత్తములం బ్రియమంది బ్రాహ్మణ
క్షత్త్రియవైశ్యశూద్రు లొఁగి గైకొని మోచిరి త్రవ్వితండముల్.

134


వ.

అనంతరంబ యవభృథాభిషేకనిరతిశయతేజోవిరాజితుండై, యారాజశేఖరుం డాత్మీయమందిరంబు బ్రవేశించి, యాస్థానమండపాభ్యంతరం