పుట:విక్రమార్కచరిత్రము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

183


క.

చని జనపతి తనకూర్చిన
జనవినుతమఖోపకరణసామగ్రి ప్రియం
బున వేఱువేఱ చూపఁగ
ననురాగముఁ బొంది భట్టి యద్భుతమతియై.

105


వ.

అంత మధుమాసపూర్ణమాసి యాసన్నం బగుటయు.

106


క.

తమలో నొండొరు మెచ్చక
సమధికవైభవసమగ్రసామ్రాజ్యరమా
రమణీయు లగుచు వచ్చిరి
సమధికశృంగారు లైనజగతీనాథుల్.

107


ఉ.

వారలకెల్ల నమ్మనుజవల్లభుఁ డాసనపాద్య ముఖ్యస
త్కారములన్ సముజ్జ్వలదగారములన్ రసవచ్చతుర్విధా
హారములన్ రయం బొసఁగునట్టులుగా నియమించె విశ్వధా
త్రీరమణీశవర్ణితమతిం దనమామ విదర్భభూపతిన్.

108


క.

పరమజ్ఞాననిరూఢులుఁ
బరమతపోవర్థితప్రభావులు నగు భూ
సురముఖ్యులు మునిముఖ్యులు
నరుదెంచిరి యజనదర్శనాపేక్షితులై.

109


క.

పరమాదరమున వారల
తరతమభావంబు లెఱిఁగి తగఁ బూజింపన్
వరరుచిమాతామహునిం
బరహితమతి విష్ణుశర్మఁ బ్రార్థన చేసెన్.

110


వ.

మఱియుఁ బ్రతివాసరసమాగతులైనవారికెల్ల నుల్లంబులు పల్లవింప నుచితోపచారంబు లొనరించుచు, నొక్కనాఁడు సకలసేనాధీశ్వరసంయమీశ్వరమంత్రిసామంతపురోహితపరివృతుండై పేరోలగం బున్నయవసరంబునం, దదీయప్రాణబంధువయిన సుధాసింధువుం బిలువంబోయిన