పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

వాసిష్ఠరామాయణము


యొప్పార గౌతమియుత్తరతటమున
        మహనీయ మగుపెద్దమనికియందు


గీ.

స్థిరతరారామతతులు సుక్షేత్రములును
బెక్కు లార్జించి సితకీర్తిఁ బెంపు మిగిలి
యఖలజగదన్నదాత నా నవనిఁ బరఁగె
మధురగుణదుర్యుఁ డయ్యలమంత్రివరుఁడు.

33


చ.

ఒనరఁగ నవ్వధూవరు లహోబలదేవునిఁ గొల్చి తద్వరం
బున నొగి సింగనార్యుని నమోఘగుణాఢ్యు ననంతుని న్మహీ
జననుతు నోబయాంకు బుధసన్నుతిపాత్రుని నారయాహ్వయుం
గని నరసింహనామములు గారన మారగఁ బెట్టి రందఱన్.

34


క.

వారలలో నగ్రజుఁడను
వారిజదళనయనచరణవారిజసేవా
సారమతి నతులవాక్య
శ్రీరచనాచతురమతిని సింగాహ్వయుఁడన్.

35


క.

కూనయముప్పనృపాలక
సూను శ్రీ తెనుఁగున్నపతి సుదతీ మల్లాం
బా నందనుఁ డగు ముప్పయ
భూనాథుని సుకవివరుఁడ బుధసన్నుతుఁడన్.

36


ముప్పప్రభువర్ణనము

వ.

మఱియు రాజకంఠీరవం బగు నాకుమారముష్పభూపాలుని ప్రాభవ
పరాక్రమంబు లెట్టి వనిన.

37


సీ.

సంపెంగవిరులతో జాజులుం గురువేరు
        కొమరార నునుసేసకొప్పువెట్టి,
మృగమదకర్పూరమిళిత మౌపన్నీరు
        తనుపార మేనఁ జందన మలంది,