పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7


పుత్త్రిఁ జిట్టాంబిక బుధలోకకల్పక
        వల్లి వివాహ మై వైభవమున,
భూసార మగుకోటభూమిఁ గృష్ణానదీ
        దక్షిణతటమున ధన్యలీల
నలకు రావెల యనునగ్రహారము తన
        కేకభోగ్యంబుగా నేలుచుండి,


గీ.

యందుఁ గోవెల గట్టి, గోవిందు నెన్న
గోపికానాథుని ప్రతిష్ఠఁ గోరి చేసి
యఖలవిభవంబులందును నతిశయిల్లె
మనుజమందారుఁ డల్లాడమంత్రివిభుఁడు.

29


క.

అయ్యువతీ రమణులకును
నయ్యలమంత్రీంద్రుఁ డుదితుఁ డై ధారుణిలో
నెయ్యెడ నర్థార్థులు మా
యయ్య యనుచుఁ బొగడ నెగడె నౌదార్యమునన్.

30


వ.

అమ్మంత్రిచంద్రు గుణవిశేషంబు లెట్టివనిన.

31


చ.

తిరుగనిమందరాచలము ద్రిమ్మటఁ బొందనిభానుఁ డుగ్రుచేఁ
గరఁగని కాముఁ డమ్ముమొనఁ గ్రాఁగనివారిధి యన్యకాంతది
క్కరుగనినిర్జరేంద్రు డెడ రైనను బొంకని ధర్మసూతి నా
బరఁగె ధరిత్రి నర్థిజనభానుజుఁ డయ్యలమంత్రి పెంపునన్.

32


సీ.

ఆత్రేయగోత్రపవిత్ర పేరయమంత్రి
        పుత్రి సింగాంబికఁ బుణ్యసాధ్వి
వెలయ వివాహ మై, వేఁగిదేశంబులో
        నేపారు రాజమహేంద్రపురికి
నధిపతి తోయ్యేటి యనపోతభూపాలు
        మంత్రి యై రాజ్యసంపదలఁ బొదలి,