పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

41


వ.

అది యెట్లంటేని.

33


సీ.

దొరసి వేదాంతవాదులు బ్రహ్మ మన, సాంఖ్య
        వరశాస్త్రనిపుణులు పురుషుఁ డనఁగ,
విజ్ఞానవిదులు శుద్ధజ్ఞాన మితఁ డన,
        శూన్యమతజ్ఞులు శూన్య మనఁగ,
నర్కాదితేజంబు లన్నియు నెవ్వండు
        వెలిగించుచును దాను వెలుఁగుచుండు,
కర్తయు భోక్తయు స్మర్తయు భర్తయు
        ద్రష్టయు ఋతము నై దనరు నతఁడు,


గీ.

అఖిలమున నుండి లేనివాఁ డయ్యె నెవ్వఁ,
డరయ దేహస్థుఁ డై దూర మయ్యె నెవ్వఁ,
డధికతేజంబుతోఁ బేర్చి యతఁడు విమల
చిత్ప్రకాశస్వరూపమై చెలఁగుచుండు.

34


క.

విదితంబుగ నద్దేవుని
సదమలరూపంబునందు జగదూర్ము లొగిం
బొదువుచు విచ్చుచు వెలుఁగుచు
మరి విస్మృతి సేయు నెండమావులభంగిన్.

35


వ.

అనంతం బగుజగద్బృందంబు తాను జేయుచు నెన్నడు నెద్దియుం
జేయనివాఁ డై యుత్పత్తిస్థితిలయంబులు దొఱంగి నిర్వికల్పజ్ఞానస్వ
రూపుం డై యాత్మ యొక్కండును దనయంతన వెలుంగుచుండు నని
తత్త్వస్వరూపం బెఱింగించి యిట్లనియె.

36


సీ.

అఖిలేతిహాసంబులందు సారం బైన
        యాకాశజాఖ్యాన మర్థి వినిన
వారలు నిత్యజీవన్ముక్తులై పొల్తు
        రిట్టిజీవన్ముక్తుఁ డెవ్వఁ డనిన