పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

3


సదయాత్ముల భాగవతుల సతతము దలఁతున్.

9


వ.

అని పరబ్రహ్మోపాసనంబును, నిష్టదేవతాభివందనంబును, సుకవివిద్వ
జ్జనప్రార్థనంబును, కుకవిజనవాగ్బంధనంబును, గురుచరణస్మరణం
బును, బరమభాగవతసంకీర్తనంబునుం జేసి, కృతకృత్యుండ నై,
తొల్లి హరిభక్తిరసావేశంబున గతిపయాక్షరాభ్యాసచాపలంబునం
జేసి, విష్ణువిభవాభిరామకథాప్రభూతంబులం బద్మపురాణోత్తరఖండం
బును భాగవతదశమస్కందంబును దెనుంగున రచియించి, యప్పుణ్య
పురాణంబులకున్ గృతిపతిగా నేపుణ్యం బ్రార్థింతునో యని విచా
రించి, గజగంధవారణ గండగోపాల చలమర్తిగండ రాయగజకేసరి
దొంతిమన్నె విభాళాది నానాబిరుదవిఖ్యాతులం బ్రసిద్ధుం డగు రామ
గిరిపట్టణాధీశ్వరుండైన కుమారముప్పభూపాలుని మాన్యమంత్రివర
ధురంధరుండును, నమ్మహారాజ దిగంతవ్యాప్త కీర్లిలతాలవాలుం
డును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య వివేక విశేషగుణాలంకారుం
డును, నఖిలదిగ్భరితకీర్తివిశాలుండును, వాణసవంశాభిసుధాకర కాశ్య
పగోత్ర పవిత్రాబ్బనార్యతనూభవుండునునగు కొండనామాత్యుండు,
నాకు నతిస్నేహబాంధవుండును, నపూర్వవచనరచనాబంధురకావ్య
రసాభిజ్ఞుండును,నర్థిజనపారిజాతుండును, గావున, నమ్మంత్రి యుగంధ
రుం గృతిపతిం గావించి, వెండియుం గవిత్వతత్త్వరచనాకౌతుకం
బునం జిత్తంబు జొత్తిల్ల నొక్క కృతిం జెప్పంబూనితి. అందేని నిఖిల
భూతాంతర్యామియు, నిగమార్థగోచరుండును, నిత్యసత్యజ్ఞానానంద
శుద్ధాంతరంగుండును, నిశ్చలానందయోగీంద్రహృదయుండును, నిః
శ్రేయసానందఫలప్రదాయకుండును, నిర్మలచిదాభాసుండును, నిరా
కారుండును, నిర్గుణబ్రహ్మంబును, నగు నారాయణుం డొక్కరుండు
దక్క నన్యంబు లే దనియును, బ్రహ్మాదిచేతను లతనితేజఃకణంబు లని
యును, దేహం బనిత్యంబు దేహి నిత్యుం డనియును, జీవుండు చిత్తం