పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

37


వలనం దరంగంబులును గాంచనంబువలనం గటకమకుటాది భూషణం
బులును జనియించుచందంబున శాశ్వతం బగుపరమాత్మయందు నశ్వ
రం బగుసృష్టిపృథగ్భావంబున వర్తిల్లు ఇట్టిద యని యుత్పత్తిప్రకా
రం బెఱుంగు మని చెప్పి వసిష్ఠుండు మఱియు నిట్లనియె.

7


ఆకశజోపాఖ్యానము

క.

విను రాఘవ యాకాశజుఁ
డను పేరిటివిప్రవర్యుఁ డాత్మవిదుఁడు స
జ్జనహితుఁడు ధర్మశీలుఁడు
ఘనుఁ డాయుష్మంతుఁ డొకఁడు గలఁ డీధాత్రిన్.

8


గీ.

అతని తేజంబు దుస్సహమై వెలుంగ,
మృత్యు వతికోపమున వాని మ్రింగ వచ్చి
తనకు నొకభంగి నగపడ కునికిఁ జూచి
కినుక వొడమిన మది వితర్కించె నిట్లు.

9


గీ.

కాలపాశంబు గయికొని క్రమముతోడ
నఖిలభూతంబులను మ్రింగునట్టి నాకు
నకట యీతనియందు వ మ్మయ్యె నాదు
శక్తి యుపలంబు సోఁకినశస్త్ర మట్ల.

10


వ.

అని వితర్కించి.

11


క.

ఆవిప్రుదివ్యతేజము
భావింపఁగఁ జక్కఁ జూడఁ బట్టఁగఁ గదియం
గా వెరవు లేక మృత్యువు
వేవేగను వచ్చెఁ బ్రేతవిభు సన్నిధికిన్.

12


వ.

ఇట్లు చనుదెంచి సమవర్తిం గనుంగొని మృత్యువు కృతాంజలి యై యిట్లనియె.

13


శా.

దేవా దేవరయాజ్ఞ మోచుకొని ధాత్రిం బొల్చు భూతావళిన్