పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

వాసిష్ఠరామాయణము


శ్రాంతస్వాంతుండు రామ సౌజన్యనిధీ!

172


గీ.

వఱల నప్రాప్తములయెడ వాంఛ యెడలి
ప్రాక్యములయెడ సమతమైఁ బట్టుకొల్పి
పూని సుఖదుఃఖములు మదిఁ గానఁ బడని
యతఁడు సంతుష్టుఁ డనఁబడు నఖిలమునను.

173


గీ.

సర్వమానవులకు సంసారతారణ
కారణంబు పుణ్యకారణంబు
నై వెలుంగుచుండు నఖిలసంస్తుత్య మై
సాధుసంగమంబు జనవరేణ్య!

174


గీ.

విమలమతులు సములు వీతగర్వగ్రంథు
లాత్మవిదులు సాధు లైనజనులు
సేవ్యు లెందు వారి సేవించుటయ భవ
జలధి యుత్తరింపఁ గలుగువెరవు.

175


వ.

ఇట్లు సేవింపంబడు భవభేదనోపాయంబులను నీనాలిగింటి నభ్యసిం
చినవారలు మోహపారావారోత్తీర్ణులు అని చెప్పి వసిష్ఠుండు
మఱియు నిట్లనియె.

176


గీ.

యుక్తియుక్త మైనసూక్తులు బాలుండు
చెప్పి నేని వినుము చిత్తగించి,
యన్య మైనవచన మది బ్రహ్మ చెప్పినఁ
దృణమ పోలె విడువు ధీరహృదయ.

177


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

178


సీ.

బ్రహ్మోపదేశంబు స్పష్టంబుగా నీకు
దృష్టాంత మొప్పఁగాఁ దేటగాఁగ
నింతయుఁ జెప్పితి నిది యుపదేశ సా
మగ్ర్యంబుగాఁ జిత్తమందు నెఱుఁగు