పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

15


దనుజులు చెఱుపంగ విసికి తద్రణక్షణకై
ఘను రామచంద్రు నచటికిఁ
గొనిపోయెద నని యయోధ్యకున్ జనుదెంచెన్.

74


వ.

ఇవ్విధంబున ననేకమునిగణపరివృతుం డై జనుదెంచిన కౌశికునకు
దశరథేశ్వరుం డెదురు సని నమస్కరించి తోడ్కొని వచ్చి యాసనా
ర్ఘ్యపాద్యాదివిధులం బూజించి కుశలం బడిగిన యనంతరంబ, రామ
చంద్రదర్శనలాలసుం డై యభ్యంతరమందిరంబున కరుగ నక్కు
మారుండును బ్రత్యుత్థానంబు చేసి ప్రణమిల్లి పూజించి కుశలం బడిగి
నయనంతరంబ, సుఖాసీనుం డై యమ్మునిపుంగవుండు రాఘవుం గరు
ణార్ద్రదృష్టిం జూచి యంగంబు నివురుచు ని ట్లనియె.

75


వైరాగ్యప్రకరణము

సీ.

తండ్రి రాజ్యస్థుఁ డై ధరణిఁ బాలింపంగ
యువరాజవైభోగయోగ్య మైన
యౌవనంబున సౌఖ్య మనుభవించుచు నుండ
కిట్టిమనోవ్యథ యేల కలిగె?
నెలుకలు ద్రవ్వినయింటిచందంబున
దిగజాఱి నీమేను మిగుల డస్సె
నీదుఃఖములు నీకు నేయర్థమునఁ బుట్టె?
నిట్టివిరక్తి నీ కేల వచ్చెఁ?


గీ.

గెలనివారు నవ్వఁ గలఁగి మ్రాన్పడి యున్న
నిన్నుఁ జూచి వగ జనించె నాకు
వినుము దెవులు లేనివేదనఁ బొరలుచు
నున్నరూపు సెప్పవోయి వత్స.

76


చ.

అన విని రామచంద్రుఁడు కృతాంజలి యై తల వంచి భక్తి న
మ్మునికి నమస్కరించి, వగ మో మెగయింపఁగ లేక, బాష్పముల్